చింత తీర్చేదెవరో..?
ఈ ఏడాది చింతపండు సీజనులో వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి గిరిజన సహకార సంస్థ ప్రయత్నిస్తోంది. దీంతో పాటు వన్దన్ వికాస కేంద్రాలకు ఇచ్చిన నిధులతో చింతపండు వ్యాపారం చేయాలని వెలుగు చూస్తోంది.
పార్వతీపురం, న్యూస్టుడే
సాలూరు: సంతకు తెచ్చిన చింతపండు
ఈ ఏడాది చింతపండు సీజనులో వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి గిరిజన సహకార సంస్థ ప్రయత్నిస్తోంది. దీంతో పాటు వన్దన్ వికాస కేంద్రాలకు ఇచ్చిన నిధులతో చింతపండు వ్యాపారం చేయాలని వెలుగు చూస్తోంది. ఈ రెండూ కాకుండా వ్యాపారులు రంగంలోకి దిగి కొనుగోలు ప్రారంభించారు. వారి ఆకర్షణలకు లోనవుతున్న గిరిజనులు పంటను తక్కువ ధరకే అమ్ముతూ నష్టపోతున్నారు.
మద్దతు ధర ఇచ్చినా..
కిలో చింతపండుకు జీసీసీ రూ.32.40 ధరను చెల్లిస్తోంది. జిల్లాలోని రెండు డివిజన్లు కలిపి 15 వేల క్వింటాళ్లు కొనుగోలుకు నిర్ణయించారు. నాణ్యతలో రాజీ పడకుండా పొడి బొట్టను మాత్రమే కొంటున్నారు. ఇలా ఇప్పటివరకు పార్వతీపురం డివిజన్లో 1,300 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. దీంతో పాటు వన్దన్యోజన కేంద్రాలతో టీపీఎంయూ కొనుగోలు చేయించింది. వీటిలో చింతపండు కేకులు తయారు చేసే యంత్రాలను గతంలో మండలానికి ఒకటి వంతున 8 ఉపప్రణాళిక మండలాలకు పంపించారు. వీటిలో కురుపాం, మక్కువ మండలాల్లో మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం. కురుపాంలో రూ.28 లెక్కన 5 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. వీరికి విక్రయించడం కంటే బయట అమ్ముకుంటే మంచి ధర వస్తుండటంతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు.
జీసీసీ కంటే తక్కువ చెల్లిస్తున్నా..
నాణ్యతతో సంబంధం లేకుండా పంట ఎలా ఉన్నా కొంటామని కొందరు వ్యాపారులు ముందుకొస్తున్నారు. వీరే ధరను నిర్ణయిస్తున్నారు. గ్రేడింగ్ సరకుకు రూ.40 పైన, మిగిలిన దానికి కిలోకు రూ.22, నుంచి రూ.25 మధ్య చెల్లిస్తున్నారు. ఇక్కడ క్వింటాకు 20 కిలోలు కూడా గ్రేడింగ్ ఉన్న పంట వచ్చే అవకాశం లేదు. ఈ లెక్కన జీసీసీ చేస్తున్న చెల్లింపులకంటే వ్యాపారులు తక్కువే చెల్లించినట్లు అవుతుంది. కానీ గిరిజనులు మాత్రం అటువైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది కాపు ఆలస్యంగా రావడంతో పాటు ఇటీవల వర్షాలకు బొట్లలో నీరు దిగడంతో గ్రేడింగ్ తగ్గే అవకాశముండటతో వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు.
అవగాహన కల్పించాం..
- వి.మహేంద్రకుమార్, జీసీసీ డీఎం, పార్వతీపురం
చింతపండు సీజను ప్రారంభానికి ముందే నాణ్యత, మద్దతు ధరలపై గిరిజన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాం. జీసీసీకి అమ్మడంతో కలిగే ప్రయోజనాలను వివరించాం. మెరుగైన ధర చెల్లిస్తుండటంతో నాణ్యమైన సరకు కావాలని కోరాం. కానీ కొందరు గ్రేడింగ్ చేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గ్రేడింగ్తో సంబంధం లేకుండా పొడిగా, నాణ్యంగా ఉంటే రూ.32.40 చెల్లిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు