మావయ్యా.. ఇదేం మాయ
‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్యా’ ప్రతి సభలోనూ.. ప్రతి కార్యక్రమంలోనూ విద్యార్థులతో సీఎం జగన్మోహన్రెడ్డి ఇలా డప్పు కొట్టించుకుంటూనే ఉన్నారు.
వైకాపా వచ్చాక విజ్ఞాన యాత్రలు శూన్యం
గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: ‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్యా’ ప్రతి సభలోనూ.. ప్రతి కార్యక్రమంలోనూ విద్యార్థులతో సీఎం జగన్మోహన్రెడ్డి ఇలా డప్పు కొట్టించుకుంటూనే ఉన్నారు. విద్యా రంగానికి ఎన్నో చేశామని చెప్పి.. మాయ చేశారు. ఆ రంగాన్నే నిస్తేజంగా మార్చేశారు. ఈక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారి కోసం చేపట్టాల్సిన విజ్ఞాన, విహార యాత్రలను పూర్తిగా విస్మరించారు. ఐదేళ్లుగా నిర్వహణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం వీటికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించింది.
నాడు ఉల్లాసం.. నేడు నీరసం
తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం గత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా విజ్ఞాన యాత్రలు సాగేవి. ఒక్కో విద్యార్థికీ రూ.200 చొప్పున కేటాయించేది. పాఠ్యాంశాలకు సంబంధించిన, ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఉపాధ్యాయులు చూపించేవారు. వైకాపా వచ్చిన కొత్తలో ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. ఈలోపు కరోనా రావడంతో క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు సైతం వెళ్లలేదు. దీంతో నిధుల మంజూరు ఆగిపోయింది.
జిల్లాలో ఇలా..
మన్యం జిల్లాలో మొత్తం 1698 పాఠశాలలున్నాయి. వీటిలోని 227 ఉన్నత పాఠశాలల్లో 28 వేల మంది తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరందరినీ క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సి ఉంది. దీనిపై డీఈవో పగడాలమ్మను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. పైనుంచి ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నిర్లక్ష్యం ఖరీదు.. రూ.14.40 కోట్లు!!
[ 27-07-2024]
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కీలక మార్గం. -
గడప గడపకు ‘దగా’
[ 27-07-2024]
వైకాపా పాలనలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాల్లో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశారు -
అసెంబ్లీలో మన్యం సమస్యలపై గళం
[ 27-07-2024]
అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కొత్త హంగులతో అన్న క్యాంటీన్
[ 27-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. -
భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
[ 27-07-2024]
జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక ఏడాదిలో లక్ష్యాలను చేరుకోలేకపోయింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య, వృద్ధిరేటు పెరుగుతూ వచ్చింది -
123 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే..వారికి సమస్యల బోధన
[ 27-07-2024]
గిరిజన బాలుర ఆశ్రమాల్లోని తోణాం ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ 123 మంది విద్యార్థులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు. హెచ్ఎంతో సహా ముగ్గురు ఉపాధ్యాయులుండే ఈ విద్యాలయంలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటీ వార్డెన్గా బాధ్యతలు చేపట్టారు. -
అయిదేళ్ల తరువాత మట్టి పరీక్షలు!!
[ 27-07-2024]
పంటల దిగుబడికి భూసారమే కీలకం. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం మట్టి పరీక్షలు చేపట్టి.. ఉదజని సూచిక, లవణాల పరిమాణం, నత్రజని, పొటాష్, సేంద్రియ కర్బనం, భాస్వరం, గంధకం తదితరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేయాలి. -
గొడుగులతో వెళ్లాల్సిందే!!
[ 27-07-2024]
బొబ్బిలిలోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి సొంత భవనం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది పట్టణంలోని పురపాలక కార్యాలయానికి చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల