నొచ్చుకున్న ప్రజాప్రతినిధులు!
గణతంత్ర వేడుకల్లో తమకు సరైన గౌరవం దక్కలేదని జిల్లా ప్రజాప్రతినిధులు నొచ్చుకున్నారు.
హై టీ కార్యక్రమానికి డుమ్మా
వీఐపీ గ్యాలరీకే పరిమితమైన బాలినేని, బూచేపల్లి, మాగుంట,
సుజాత, తూమాటి తదితరులు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: గణతంత్ర వేడుకల్లో తమకు సరైన గౌరవం దక్కలేదని జిల్లా ప్రజాప్రతినిధులు నొచ్చుకున్నారు. కలెక్టర్ ప్రసంగిస్తుండగానే కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వేడుకలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్బాబు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత తదితరులు హాజరయ్యారు. వీరెవరినీ వేదిక పైకి ఆహ్వానించలేదు. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించడానికి కూడా ప్రధాన వేదిక వద్దకు పిలవలేదు. వీఐపీ గ్యాలరీలో సాధారణ వీక్షకుల్లా వందనం సమర్పించాల్సి వచ్చింది. ఈ పద్ధతికి ప్రజాప్రతినిధులు నొచ్చుకున్నారు. పోలీసు కవాతు ముగిసి.. కలెక్టర్ ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు వ్యవహరించిన తీరుపై ఎంపీ మాగుంట మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. గణతంత్ర వేడుకలకు ఎంపీ మాగుంట ఏటా హాజరవుతుంటారు. అధికారులు కూడా సభా వేదికపై ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుంటారు. అదేరోజు సాయంత్రం నిర్వహించే హై టీ కార్యక్రమంలోనూ సందడి చేస్తారు. ఈ దఫా మాత్రం ప్రజాప్రతినిధుల్ని కార్యక్రమ నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఎంపీ మాగుంటను బుజ్జగించేందుకు ఒక సీనియర్ పోలీసు అధికారిని పంపి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమానికి ఆయనతో పాటు, ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ మాత్రమే పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే