వేతనం ఎప్పుడొచ్చేను!
ఒంగోలుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సొంతిల్లు నిర్మాణ నిమిత్తం బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ రూ.40 వేల చొప్పున చెల్లించాలి.
వివిధ శాఖల ఉద్యోగుల ఎదురుచూపులు
ఒంగోలుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సొంతిల్లు నిర్మాణ నిమిత్తం బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ రూ.40 వేల చొప్పున చెల్లించాలి. ముందస్తుగా ఆయన చెక్కు ఇచ్చారు. గడువులోపు చెల్లించకుంటే అదనంగా రూ.500 జరిమానాతోపాటు, క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. గతేడాదిగా జీతాల సమస్య నెలకొనడంతో స్నేహితుల వద్ద సర్దుబాటు నిమిత్తం తీసుకుని ఖాతాలో నిల్వ ఉంచుతున్నారు. ప్రతి నెలా ఇదో సమస్యగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉద్యోగులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి నెలా ఒకటో తేదీన వేతనం వస్తుందన్న పరిస్థితి మారిపోయింది. ఈ నెల 8వ తేదీ గడిచినా పలు కీలకశాఖలకు చెందిన ఉద్యోగులకు జమకాలేదు. జిల్లాలో 72 శాఖలకు చెందిన సుమారు 40 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అందులో గరిష్ఠంగా ఏడు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ తర్వాత రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్య, వ్యవసాయ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఎక్కువమంది కనిపిస్తారు. వీరందరికీ ప్రతి నెల వేతనాల చెల్లింపు నిమిత్తం సుమారు రూ.200 కోట్ల నిధులు అవసరం. గతేడాదిగా ఉద్యోగులకు జీతాల చెల్లింపులో రోజుల తరబడి జాప్యం జరుగుతూనే ఉంది. ప్రాధాన్యతా క్రమంలో తొలుత ఖజానాశాఖతో పాటు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు, రెవెన్యూ శాఖకు క్రమం తప్పకుండా వేతనాలు జమవుతున్నాయి. ఇప్పటికీ వేతనాలు అందని ఉద్యోగుల్లో ఉపాధ్యాయ, పశు సంవర్ధకశాఖ, పరిశ్రమలు, సెరికల్చర్, ఇంజినీరింగ్, జలవనరులు, జిల్లా యువజన సంక్షేమ, జిల్లా పౌరసరఫరాలు, భూ సేకరణ విభాగం తదితర శాఖలవారు ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వారికి ఒకటో తేదీనే పెన్షన్లు జమ కావడం కాస్త ఊరట.
రుణం లభించక
బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, పిల్లలకు విద్యా రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈంఎఐల చెల్లింపులకు అయిదో తేదీ గడువు పెట్టుకుంటారు. పదో తేదీ దాటే వరకు జీతం రాకపోవడంతో వడ్డీ భారం పడుతుందని వాపోతున్నారు. మరోవైపు ఇంటి అద్దె, పాలు, నిత్యావసరాలు, ఔషధాలు, విద్యుత్తు బిల్లు తదితర ఖర్చులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. రుణాలు దొరకడమూ కష్టమైంది.
ఒకటో తేదీనే చెల్లించాలి
నెలంతా పనిచేస్తాం. ఒకటో తేదీనే వేతనం తీసుకోవడం ఉద్యోగి హక్కు. పదో తేదీ వరకు సగం శాఖలకు చెందిన ఉద్యోగులకు ఇవ్వకపోతే ఇంటి నిర్వహణ ఎలా? పైగా బ్యాంకులో తీసుకున్న గృహ, వ్యక్తిగత రుణాలకు నెలవారీ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. వాటిపైనా ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు అడ్డంకిగా మారుతుంది.
రోజ్కుమార్, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్