నేడు కారుమంచికి సీఎం జగన్
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి సోమవారం రానున్నారు.
పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలికా గార్గ్,
స్పెషల్ సెక్యూరిటీ వింగ్ అధికారి రంగబాబు తదితరులు
ఒంగోలు నేరవిభాగం, టంగుటూరు, న్యూస్టుడే: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి సోమవారం రానున్నారు. వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్బాబు, బాపట్ల జిల్లా వైకాపా సీనియర్ నాయకుడు, నేత్ర వైద్యుడు డాక్టర్ అమృతపాణిల తల్లి కోటమ్మ(82) వృద్ధాప్యం కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. స్వగ్రామం అయిన టంగుటూరు మండలం కారుమంచిలో అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నారు. కోటమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు సీఎం జగన్ రానున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారు కావడంతో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలికా గార్గ్, స్పెషల్ సెక్యూరిటీ వింగ్ అధికారి ఎ.ఎన్.రంగబాబుతో కలిసి కారుమంచి గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు సీఎం హెలికాఫ్టర్లో కారుమంచి చేరుకోనున్నట్టు ప్రాథమిక సమాచారం. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేడ్కర్ క్రీడా ప్రాంగణం వద్ద కోటమ్మ భౌతికకాయానికి ముఖ్యమంత్రి, ఇతర నాయకులు నివాళులు అర్పిస్తారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ నుంచి ప్రాంగణానికి వెళ్లే మార్గంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రెవెన్యూ, ఆర్అండ్బీ, రవాణా, విద్యుత్తు, అగ్నిమాపక శాఖలతో పాటు పలు విభాగాల అధికారులు, సిబ్బంది తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పర్యటన షెడ్యూల్ ఇలా...
సోమవారం ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయలుదేరుతారు. 10.55కు టంగుటూరు మండలం కారుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.05 గంటల వరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడతారు. 11.15కు రోడ్డు మార్గాన అంబేడ్కర్ క్రీడా ప్రాంగణానికి చేరుకుని వరికూటి కోటమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తారు. వరికూటి అశోక్బాబు, అమృతపాణి కుటుంబీకులను పరామర్శిస్తారు. 11.45కు హెలిప్యాడ్కు చేరుకుంటారు. 12.05కు హెలిప్యాడ్ వద్ద స్థానిక నాయకులతో ముచ్చటిస్తారు. 12.10 గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం