ప్రభుత్వ విధానాలతో ఆక్వాలో సంక్షోభం
విద్యుత్తు ఛార్జీ రాయితీ అంటూ లేనిపోని నిబంధనలు అమలు చేస్తుండటంతో ఆక్వా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అసంబద్ధ విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకున్నారని రొయ్య రైతుల సంఘం జిల్లా కన్వీనర్ డి.గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న గోపీనాథ్.. చిత్రంలో ఆక్వా హేచరీస్ సంఘం ప్రతినిధులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: విద్యుత్తు ఛార్జీ రాయితీ అంటూ లేనిపోని నిబంధనలు అమలు చేస్తుండటంతో ఆక్వా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అసంబద్ధ విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకున్నారని రొయ్య రైతుల సంఘం జిల్లా కన్వీనర్ డి.గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హేచరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు. పది ఎకరాల్లోపు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు రూ.1.50కే సరఫరా చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందన్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలతో 80 శాతం మందికి ఆ విధానాన్ని తొలగించినట్టు తెలిపారు. డీకేటీ భూముల్లో సాగు చేసే చెరువులకు, వెబ్ల్యాండ్లో నమోదు కాని వాటికి, ప్రభుత్వ భూములకు రాయితీ తొలగించినందున విద్యుత్తు రాయితీ ప్రయోజనాన్ని కేవలం 20 శాతం మంది మాత్రమే పొందుతున్నారని చెప్పారు. జిల్లాలో ఎక్కువమంది తీరప్రాంతంలోని వృథా భూముల్లో ఉప్పునీటి ఆధారంగా, చిన్న, సన్నకారు రైతుల భూములు లీజుకు తీసుకుని రొయ్యల చెరువుల సాగు చేపట్టినట్టు తెలిపారు. వీరికి ప్రారంభంలో రాయితీ ఇచ్చి ఇప్పుడు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. విద్యుత్తు బిల్లుల భారం మోయలేక పలువురు ఇప్పటికే ఆక్వా సాగు విరమించుకున్నారని, మరికొందరు నష్టాల బారిన పడ్డారన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన రాయితీని కూడా తిరిగి చెల్లించాలంటూ విద్యుత్తు బిల్లుల్లో కలిపి నోటీసు ఇస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. హేచరీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. హేచరీలను సముద్రతీరానికి సమీపంలో నిర్వహించకూడదని ఆంక్షలు పెట్టడం వల్ల నిర్వాహకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. సీఆర్జడ్, కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ ఇష్టానుసారం నిబంధనలు విధిస్తుండటం కారణంగా హేచరీల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. ఇప్పటికే పలువురు మూసివేయగా, మరికొందరు ఉత్పత్తి తగ్గించుకున్నారన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రతినిధులు పి.సుబ్బారావు, ఎన్.సుభాజీ, టి.వెంకట్రావు, ఎస్.అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?