ఇంత బరితెగింపు ఏంటన్నా!
చెప్పుకొనేందుకు చేసిన అభివృద్ధి పనులేమీ లేవు. దీంతో ప్రలోభాలనే నమ్ముకున్నట్లున్నారు అధికార పార్టీ నేతలు. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సిద్ధమని బీరాలు పలుకుతున్నారు. తాయిలాల పంపిణీకి పోటాపోటీగా బరి తెగిస్తున్నారు.
చేసిందేమీ లేక ప్రసన్నానికి పాట్లు
మార్కాపురం, న్యూస్టుడే: చెప్పుకొనేందుకు చేసిన అభివృద్ధి పనులేమీ లేవు. దీంతో ప్రలోభాలనే నమ్ముకున్నట్లున్నారు అధికార పార్టీ నేతలు. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సిద్ధమని బీరాలు పలుకుతున్నారు. తాయిలాల పంపిణీకి పోటాపోటీగా బరి తెగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కీలకంగా భావిస్తున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులే లక్ష్యంగా ఈ కథ నడుపుతున్నారు. మిఠాయిల మాటున నగదు ఎర వేస్తూ ప్రసన్నం చేసుకోవటానికి పడరాని పాట్లు పడుతున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అన్నా రాంబాబు మరింత బరితెగించి వ్యవరిస్తున్నారు. నిన్నటి వరకు వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు, మిఠాయిలు పంపిణీ చేశారు. తాజాగా మార్కాపురం మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
మిఠాయిల మాటున నగదు...
అన్నా రాంబాబు తరఫున మార్కాపురం పూర్వపు ఎంపీపీ అరుణ భర్త పోరెడ్డి చెంచిరెడ్డితో పాటు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, మరో ఓ వైకాపా నాయకుడు ఈ ప్రలోభాల పర్వానికి తెర లేపారు. మార్కాపురం మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల వద్దకు వెళ్లి అక్కడి పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతున్నారు. అనంతరం 11 మంది ఉద్యోగులకు 300 గ్రాముల బరువుండే మిఠాయిల పెట్టె అందిస్తున్నారు. మంగళవారం ఒక్క రోజే దాదాపు పది సచివాలయాలకు వెళ్లి అందుబాటులో ఉన్న ఉద్యోగులకు అందజేశారు. లేనివారికి తర్వాత ఇవ్వాలంటూ అప్పగించి వెళ్లారు. మిఠాయిల పెట్టెలను కొందరు ఉద్యోగులు, అధికారులు తీసుకునేందుకు నిరాకరించారు. కొన్ని సచివాలయాల్లో రూ.1,000 నుంచి రూ.1,500 నగదు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయగా పలువురు తీసుకోలేదని సమాచారం. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ఉద్యోగం కల్పించినందుకుగాను వైకాపాకు మీరు ఓటు వేయడమే కాకుండా మీ బంధువులతోనూ వేయించాలని కోరినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీస్ స్టేషన్ ఎదుట దొంగల హల్చల్
[ 26-07-2024]
మార్కాపురంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక గడియార స్తంభం వద్ద ఉన్న పూల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.