నిరాశాజనకంగా ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో తాళ్లూరులోని వీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల 86.67 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా.. తురిమెళ్ల కళాశాల 85.22 శాతంతో ద్వితీయ, అర్థవీడు కళాశాల 83.33 శాతంతో మూడోస్థానం దక్కించుకున్నాయి.
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో తాళ్లూరులోని వీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల 86.67 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా.. తురిమెళ్ల కళాశాల 85.22 శాతంతో ద్వితీయ, అర్థవీడు కళాశాల 83.33 శాతంతో మూడోస్థానం దక్కించుకున్నాయి. తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన కళాశాలల్లో యర్రగొండపాలెం 29 శాతం, కొమరోలు 30.95 శాతం, ఒంగోలు 33.96 శాతం ఉన్నాయి. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో తురిమెళ్ల ప్రభుత్వ కళాశాల 56.72 శాతంతో ప్రథమ, పీసీపల్లి 53.57 శాతంతో ద్వితీయ, దర్శి 42.74 శాతంతో తృతీయ స్థానాల్లో నిలిచాయి. అతి తక్కువ మంది ఉత్తీర్ణులైన కళాశాలల్లో యర్రగొండపాలెం జూనియర్ ఇంటర్ విద్యార్థులు 16.04 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఉప్పుగుండూరు 16.67, ఒంగోలు కళాశాలలో 20 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ కళాశాలల్లో రెగ్యులర్ బోధకులు లేనందునే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదని సమాచారం. పోస్టుల భర్తీ నిలిచిపోవడంతో అతిథి అధ్యాపకులకు గంటల లెక్కన వేతనం చెల్లించి చదువు చెప్పించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోయారు. ఫలితంగా కొన్ని కళాశాలల్లో 30 శాతంలోపే ఉత్తీర్ణత పడిపోయినట్లు సీనియర్ అధ్యాపకులు చెబుతున్నారు.
జూనియర్ 18, సీనియర్ ఇంటర్లో 15వ స్థానం.. : ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 18వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 15వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. జూనియర్ ఇంటర్లో 18,349 మంది పరీక్ష రాయగా 10,868 మంది (59.2 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,929 మంది పరీక్షలు రాయగా 1,032 మంది (58.7 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సులో 1,5238 మంది పరీక్ష రాయగా 10993 మంది (72శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 2001 మందికి గాను 1373 మంది (68.6శాతం) ఉత్తీర్ణత సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత