15 నుంచి అభ్యర్థుల సలహాలకు సహాయ కేంద్రం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సహాయ కేంద్రం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
నాయకులకు సూచనలిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్.. చిత్రంలో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సహాయ కేంద్రం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒంగోలు ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తవుతుందన్నారు. పత్రాల సమర్పణలో ఏమైనా సందేహాలుంటే సహాయ కేంద్రంలో నుంచి సూచనలు పొందవచ్చన్నారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల వారు నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీసు శాఖ తరఫున ఎన్నికల ఉల్లంఘనపై ఫిర్యాదుల స్వీకరణకు చరవాణి నం.91211 02266ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల విధులపై అవగాహన అవసరం: పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ విధులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. మాస్టర్ ట్రైనర్లు, మెంటార్లతో ఒంగోలులో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తవగా, రెండో విడత ఈ నెల 13, 14న నిర్వహించనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ