అల్లరిమూకలు సిద్ధం
జిల్లా కేంద్రం ఒంగోలులో రాజకీయ దాడులు, అల్లరిమూకల ఆగడాలు ఇటీవల పెచ్చుమీరుతున్నాయి. ఉద్రిక్తతలను నిలువరించాల్సిన సీనియర్ నాయకులు.. తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెంచి పోషిస్తున్న వైకాపా నేతాగణం
ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే వ్యూహం!
న్యూస్టుడే, ఒంగోలు నేరవిభాగం
జిల్లా కేంద్రం ఒంగోలులో రాజకీయ దాడులు, అల్లరిమూకల ఆగడాలు ఇటీవల పెచ్చుమీరుతున్నాయి. ఉద్రిక్తతలను నిలువరించాల్సిన సీనియర్ నాయకులు.. తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమతానగర్లో మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా తెదేపా మద్దతుదారు చప్పిడి ప్రభావతి కుటుంబంపై దాడి, అనంతరం తెదేపా నాయకుడు మేడికొండ మోహన్పై హత్యాయత్నం వంటి ఉదంతాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రతి డివిజన్లోనూ ఓ ముఠా...: ఎన్నికల నేపథ్యంలో అధికార వైకాపా అల్లరిమూకలను పెంచి పోషిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి డివిజన్లోనూ సుమారు 20 మంది నుంచి 30 మంది వరకు యువకులను ఎంపిక చేసుకుని వారితో ఆయా ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేసే వారిని గుర్తించి బెదిరింపులకు దిగడం, ఎన్నికల రోజున పోలింగ్ బూత్ల వద్ద అలజడులు సృష్టించి తటస్థ ఓటర్లను బూత్ల వద్దకు రానీయకుండా కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలున్నాయి.
బల ప్రదర్శన.. కాదా కోడ్ ఉల్లంఘన...: ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయినప్పటికీ వైకాపా నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జీజీహెచ్లో బుధవారం అర్ధరాత్రి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బల ప్రదర్శన చేశారు. ఆయన పర్యవేక్షణలోనే వైకాపా శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. అనంతరం తమ వారిని అరెస్టు చేశారంటూ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లోకి వెళ్లి శుక్రవారం మరోమారు హల్చల్ చేశారు. రెండు రోజులుగా నగరంలో ఉద్రిక్తతలున్నా.. వైకాపా శ్రేణుల్ని స్టేషన్ ఆవరణలోకి పోలీసులు రానివ్వడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టేషన్ వచ్చి తన వాదన వినిపించే హక్కు ఎమ్మెల్యేగా బాలినేనికి ఉంటుంది. అయితే వందల మందితో మోహరించి గంటల తరబడి స్టేషన్లోనే తిష్ట వేసి తాను చెప్పినట్లు, తనకు నచ్చినట్లు వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి చేయటం ఎంతమేరకు సబబు.. కోడ్ ఉల్లంఘన కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసుల దొంగాట..!: ఎన్నికల నియమావళిని పక్కాగా అమలుచేయాల్సిన అధికారులు కూడా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అనుచరులతో స్టేషన్కు వచ్చిన బాలినేనితో గంటల తరబడి చర్చలు సాగించారు. తీరా సర్వెలెన్స్ బృందం వస్తున్నట్లు తెలుసుకుని కేంద్ర బలగాల సాయంతో అక్కడ భారీగా గుమిగూడిన వైకాపా కార్యకర్తలను దూరంగా పంపారు. ఈ తరహా చర్యలతో అధికార పార్టీతో కలిసి పోలీసు యంత్రాంగం దొంగాట ఆడుతోందనే అపప్రథను మూటగట్టుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలి
[ 26-07-2024]
ప్రతి గ్రామంలో సంపూర్ణంగా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఒంగోలు డివిజన్ పంచాయతీల అధికారి పద్మ ఆదేశించారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట దొంగల హల్చల్
[ 26-07-2024]
మార్కాపురంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక గడియార స్తంభం వద్ద ఉన్న పూల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్