జగనూ.. తాగించి చిదిమేస్తావా?
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది.
నిత్య కలహాలతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. చరవాణిలో ఒక్క సందేశమిస్తే నిమిషాల్లో మద్యం బాటిళ్లు ఇళ్ల వద్దకే చేరి పోతున్నాయి. పట్టణాలు, పల్లెలో సైతం ఇదే పరిస్థితులు నెలకొంది. దీంతో గ్రామాల్లో కుటుంబంలో నిత్యం కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమై పోతున్నాయి. నాణ్యత లేని మద్యం బ్రాండ్లను తాగి పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మద్యానికి తోడుగా పశ్చిమ ప్రకాశాన్ని నాటుసారా దెబ్బతీస్తోంది.
పొదిలి, పొదిలి గ్రామీణం, పెద్దదోర్నాల, మార్కాపురం నేర విభాగం, యర్రగొండపాలెం పట్టణం
నిలువరించే వారేరీ
పెద్దారవీడు మండలం కలనూతల గ్రామంలో రెండేళ్ల క్రీతం సారా తాగి పొలం వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి దాహార్తిని తీర్చుకోలేక గొంతు ఎండిపోయి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుంటుంబం అనాథ అయింది. మూడేళ్ల కిందట గుండంచర్ల గ్రామంలోనూ ఇదే తరహా ఘటనే చోటు చేసుకుంది. ముంపు గ్రామాల్లో సారా వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా నిలువరించే నాథుడే కరువయ్యారు
వైద్య పరీక్షలో బయటపడ్డ నిజం : అర్థవీడు మండలం పాపినేనిపల్లిలో 2021 జూన్లో ఓ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇరవై కుటుంబాలకు చెందిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఈ గ్రామంలో సారా ఎక్కువగా తాగడం వల్ల చాలా మంది కామెర్లు, లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు.
కల్తీ మద్యం ఏరులై పారుతోంది
వైకాపా ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టారు. గతంలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేది. అయిదేళ్లలో రోజుకొక బ్రాండ్తో కొత్త మద్యాన్ని మార్కెట్లోకి తెచ్చారు. ధర పెంచి కల్తీ మద్యం అందించారు. దీంతో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. కొన్ని గ్రామాల్లో సారా విచ్చలవిడిగా అందుబాటులో ఉంది.
తెల్లయ్య, పెద్దదోర్నాల
సగం జీవితాలు తెల్లారి పోతున్నాయి
సారా తాగడం వల్ల చెంచుల జీవితాలు సగంలోనే తెల్లారిపోతున్నాయి. విచ్చలవిడిగా సారా కాస్తున్న వారిని పట్టుకొని కఠిన శిక్షలు విధించాలి. కొన్ని గిరిజన గూడేల్లో సారా కాయడం అమ్మడం జరుగుతోంది. కొందరికి ఇది వ్యాపారం మారింది. మా చెంచులు సారా తాగడం వల్ల ఎంతో మంది చనిపోయారు. ఇప్పటికైనా సారా, గంజాయిని అరికట్టాలి.
నిమ్మల ఈదన్న, గిరిజన నాయకుడు, పాలుట్ల
సారా తాగడం మాన్పించాలి
గిరిజనుల జీవితాలు మారాలంటే సారా తాగడం మాన్పించాలి. ఇందుకు అధికారులు చొరవ చూపాలి. సారా తాగందే చెంచులు జీవించలేకుండా ఉన్నారు. నల్లమల గూడేల్లో సారా విచ్చల విడిగా కాస్తున్నారు. అధికారులు నిలువరించ లేకపోతున్నారు. సారాను పూర్తిగా రూపు మాపితేనే గిరిజనుల జీవితాలను బాగుపడతాయి..
బొజ్జ అంకారావు, గిరిజన నాయకుడు, పుల్లలచెరువు చెంచుగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!