చోరీ కేసు నిందితుడి విషాదాంతం
చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మనస్తాపంలో బలవన్మరణానికి పాల్పడిన వైనం
మహేష్బాబు (పాత చిత్రం)
న్యూస్టుడే, సంతనూతలపాడు : చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కలకలం రేపిన ఏటీఎం నగదు చోరీ కేసులో ఏ-1 ఉన్న సన్నమూరి మహేష్బాబు(22) సోమవారం ఉరి వేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..ఈ నెల 18న ఒంగోలు - కర్నూల్ రోడ్డులోని ఇండియన్ పెట్రోలు బంకు వద్ద సీఎంఎస్ వాహనంలోని రూ.66 లక్షల నగదు చోరీకి గురైంది. దీనికి సంబంధించి కామేపల్లివారిపాలేనికి చెందిన సన్నమూరి మహేష్బాబును ఏ 1 నిందితుడిగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న అతన్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం స్టేషన్ బెయిల్పై ఇంటికి పంపించివేశారు. అప్పటి నుంచి అతను దిగాలుగా ఉన్నాడు. ఆదివారం రాత్రి మహేష్బాబు టీవీ చూసి ఇంట్లోని ఓ గదిలో నిద్రపోయాడు. సోమవారం ఉదయం తలుపు గడియ వేసి ఉండటంతో అనుమానమొచ్చి తండ్రి వెంకటేశ్వర్లు, తమ్ముడు సోమకుమార్ పక్కనున్న కిటికీ లోంచి లోపల గడియను తీసి ఇంట్లోకి వెళ్లారు. లోపల ఉరి వేసుకుని ఉన్న మహేష్ను గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఎస్సై దేవకుమార్ అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో మహేష్ రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. సీఎంఎస్ మేనేజర్ కొండారెడ్డి ప్రమేయంతోనే చోరీ చేశానని, మరో నిందితుడి రాచర్ల రాజశేఖర్కు ఎలాంటి సంబంధం లేదని అందులో రాసినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి