logo

బాబ్బాబు.. రాజీనామా చేయరూ..!

వైకాపా నేతలు తమ సైన్యం అనుకున్న వాలంటీర్లు ఇప్పుడు వారి మాట వినడం లేదు. రాజీనామా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని దొనకొండ మండల సచివాలయాల కన్వీనర్‌ గుంటు పోలయ్య తమ గ్రూపులో సోమవారం విజ్ఞప్తి చేశారు.

Published : 23 Apr 2024 04:53 IST

 వాలంటీర్లకు వైకాపా నేతల విజ్ఞప్తులు 

దొనకొండ, న్యూస్‌టుడే: వైకాపా నేతలు తమ సైన్యం అనుకున్న వాలంటీర్లు ఇప్పుడు వారి మాట వినడం లేదు. రాజీనామా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని దొనకొండ మండల సచివాలయాల కన్వీనర్‌ గుంటు పోలయ్య తమ గ్రూపులో సోమవారం విజ్ఞప్తి చేశారు. కొన్ని మండలాల్లో స్వచ్ఛందంగా చేశారని, ఇక్కడ కూడా చేయాలని కోరారు. వైకాపా నేతలు ఎన్ని విధాలుగా చెప్పినా దొనకొండ మండలంలో 242 మంది వాలంటీర్లు ఉంటే, ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాజీనామా చేయకపోవడం గమనార్హం. దీనిపై ఎంపీడీవో వసంతరావు నాయక్‌ మాట్లాడుతూ.. అధికారుల పరంగా వాలంటీర్లకు ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.ఇదిలా ఉంటే ‘ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి తమకు అన్ని విధాలా సమస్యలు ఎక్కువయ్యాయని, వైకాపా ప్రచారంలో తిరగకపోతే ఎందుకు రావడం లేదని అడుగుతున్నారని, తిరిగితే తమను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు’ అని పలువురు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని