‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఫిర్యాదుపై విచారణకు ఆదేశాలు
ఈనాడు-అమరావతి: ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఒంగోలు మండలం మల్లీశ్వరపురం, ఎ.అగ్రహారం, వెంగముక్కలపాలెం, యరజర్లలో 493.28 ఎకరాల భూమిని రూ.201.33 కోట్లకు కొనుగోలుకు వైకాపా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో భారీఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఓ తెలుగు మాస పత్రిక ఎడిటర్ సుధీర్ కుమార్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ‘భూముల కొనుగోలు కోసం జిల్లా కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేయలేదు. నోటిఫికేషన్ జారీ చేయలేదు. ధర నిర్ధరణలో వ్యక్తులు, గ్రూపులు లబ్ధి పొందేలా వ్యవహరించారు. ఇందులో రూ.201.33 కోట్ల మేర ప్రజాధనం దోపిడీకి గురైంది. బాధ్యులైన జిల్లా కలెక్టర్, జేసీ, ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు(భూసేకరణ), ఆర్డీవో, అసిస్టెంట్ డైరెక్టర్(ల్యాండ్ అండ్ సర్వే), ఒంగోలు తహసీల్దార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలి. భూ రికార్డులకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారు. పట్టాదారు, ప్రభుత్వ ఎసైన్మెంట్, పోరంబోకు స్థలాల విషయంలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకొని నివేదిక పంపాలని భూ పరిపాలన విభాగాన్ని రెవెన్యూ శాఖ ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం