అరవీర ‘రంగు’ మార్తాండ
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు.
కనిపించిన కట్టడాలకు సున్నాలు
శ్మశానాలనూ వదలకుండా సోకులు
వైకాపా ప్రభుత్వ వికృత విధానాలు
గ్రామ స్వరాజ్యానికి సమాధి రాళ్లు
రూ.11.50 కోట్లు వృథా
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. ఎక్కడ చూసినా ఛిద్రమైన, గోతులు ఏర్పడిన రహదారులు. తట్టెడు మట్టి పోసేందుకు చేతులురావు. రహదారుల వెంట చెత్త తొలగింపు మొదలు.. వీధి దీపాల నిర్వహణ వరకు ప్రతిదీ సమస్యే. బ్లీచింగ్, ఫాగింగ్కూ నాలుగు రూపాయల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి. గ్రామ స్వరాజ్యానికి వైకాపా ప్రభుత్వం సమాధి కట్టిందనేందుకు ఇవో నిదర్శనాలు. చెప్పుకొనేందుకు చేసిందేమీ లేక కనిపించిన కట్టడాలన్నింటికీ పార్టీ రంగులతో సున్నమేసి సోకులద్దే ప్రయత్నం చేశారు. ఉన్న కొద్దిపాటి నిధులను వృథాగా ఖర్చు పెట్టారు. ఈ వికృత విధానంపై న్యాయస్థానం కన్నెర్ర చేసింది. మళ్లీ వాటిని తొలగించాల్సి వచ్చింది. అందుకు మరోసారి రంగులేశారు. ఈ అనాలోచిత వికృత విధానం ఫలితంగా జిల్లాలో రూ. 11.50 కోట్ల ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరులా చేశారు వైకాపా పాలకులు.
న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
మొదటిగా రూ. 8 కోట్లు...: జిల్లాలో మొత్తం 719 సచివాలయాలున్నాయి. అనుబంధంగా ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు పార్టీ రంగులద్దారు. ఇదే అదునుగా పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పంచాయతీ భవనాలతో పాటు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, వాటర్ట్యాంక్లు, చివరికి రహదారి డివైడర్లనూ వదలకుండా రంగులద్దారు. మరికొన్ని చోట్ల శ్మశానాలు, చేపల మార్కెట్ తదితర భవనాలకు కూడా వేశారు. ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్, డంపింగ్ యార్డులకు ఒక్కోదానికి ప్రభుత్వమే రూ.20 వేలు చొప్పున ఇవ్వగా, గ్రామ సచివాలయాలు, వాటర్ ట్యాంక్లకు చదరపు అడుగుల మేరకు ఒక్కోదానికి గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. మొదటి విడత వైకాపా రంగులు వేసేందుకు సరాసరిన ఒక్కో పంచాయతీకి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వెచ్చించారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.8 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు.
హైకోర్టు ఆదేశాలతో మళ్లీ...
గ్రామాల్లోని సచివాలయాలతో పాటు, ఇతర ప్రభుత్వ భవనాలకు ఓ రాజకీయ పార్టీకి చెందిన వైకాపా రంగులు వేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తక్షణమే పార్టీ రంగులు తొలగించాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో వాటిని మళ్లీ మార్చేశారు. కనీసం తెల్ల సున్నం వేసేందుకు కూడా పంచాయతీ ఖాతాలో నిధులు లేకపోవడంతో కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. మరికొందరు మూడు రంగుల్లో ఒకటి మాత్రమే తొలగించి మమ అనిపించారు. రెండో విడత కింద పంచాయతీకి సరాసరిన రూ.50 వేలు చొప్పున రూ.3.50 కోట్ల వరకు ఖర్చు చేశారు. జిల్లా అంతటా రెండు సార్లు రంగులు వేసేందుకు సుమారు రూ.11.50 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారు.
వైకాపా రంగులతో ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం రైతు భరోసా కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!