ఇది కాదా.. జగన్నాటకం!
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం.
ఎన్నికల ముంగిట శిలాఫలకం
లోయ గ్రామాలకు సీఎం వంచన
కొత్తూరు వద్ద ఎత్తిపోతల శిలాఫలకాలు ప్రారంభిస్తున్న సీఎం జగన్(పాత చిత్రం)
అర్థవీడు, న్యూస్టుడే: అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం.. ఎన్నికల ముంగిట మాత్రం శిలాఫలకం వేసి నాటకానికి తెర లేపడం ఆయనకే చెల్లు. ఇందుకు అర్థవీడు మండలంలోని కాకర్ల ఆనకట్టే నిదర్శనం. మండలానికి సాగు నీటి వనరులు లేవు. వర్షాధారం, భూగర్భ జలాలతోనే రైతులు పంటలు సాగు చేస్తుంటారు. మండల పరిధిలో 32 గ్రామాలున్నాయి. అందులో సుమారు 37 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఏడు లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. వెలిగొండ జలాలను లోయ గ్రామాలకు పారిస్తే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుంది. ఇదే తన అజెండా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు వెలిగొండ జలాల ఎత్తిపోతల పథకాల సాధన పేరుతో పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత ఆయన 2019లో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పరిపాలనా ఆమోదంతో రూ.51.16 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇటీవల వైకాపా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇందుకు సంబంధించిన రెండు శిలాఫలకాలను దోర్నాల మండలం కొత్తూరులోని వెలిగొండ సొరంగం వద్ద సీఎం జగన్ ఇటీవల హడావుడిగా ప్రారంభించి వెళ్లారు. ఎత్తిపోతల పథకం అంశాన్ని తెర పైకి తెచ్చిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు అయిదేళ్లలో చేసిందేమీ లేక.. గిద్దలూరు నియోజకవర్గాన్ని వదలి మార్కాపురానికి రాజకీయ బదిలీపై వెళ్లారు. ఎన్నికల ముంగిట జగన్ తన మార్కు నాటకానికి తెర లేపారు. ఈ పరిణామాలతో జనం సమస్యలు అధికార పార్టీకి కేవలం ఓట్లుగా మాత్రమే కనిపిస్తున్నాయని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిలాఫలకాలను చూపుతూ లోయ గ్రామాలను మరోమారు మోసం చేసేందుకు ఆడుతున్న నాటకంపై మండిపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు