వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది.
నాడు దిక్కంటూ తాయిలాలు
నేడు రాజీనామాకు బెదిరింపులు
దర్శిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రసాద్ రెడ్డికి రాజీనామా లేఖలు అందిస్తున్న కేవీపాలెం వాలంటీర్లు
ఈనాడు, ఒంగోలు
- చీమకుర్తి పురపాలక సంఘంలో 64 మంది వార్డు వాలంటీర్లు సోమవారం తమ రాజీనామా పత్రాలను కమిషనర్కు సమర్పించారు.
- తాళ్లూరులోని రెండు సచివాలయాలకు చెందిన 30 మంది వాలంటీర్లు ఒకేరోజున ఎంపీడీవో రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు సమర్పించారు.
- దర్శి నగర పంచాయతీలోని అయిదు సచివాలయాల పరిధిలో 86 మంది వాలంటీర్లు సోమవారం ఒక్కరోజే రాజీనామా చేశారు.
- దొనకొండ మండలంలో చందవరం, పోలేపల్లి, కొచ్చెర్లకోట గ్రామాలకు చెందిన 18 మంది మంగళవారం రాజీనామా లేఖలను అధికారులకు అందజేశారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వారితో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛను అందించి గొప్పగా ప్రచారం చేసుకుంది. వాలంటీర్ల వ్యవస్థ భేష్ అంటూ ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు వారిపై ప్రశంసలు కురిపించారు. సేవారత్న పేరుతో పురస్కారాలు, వాలంటీర్లకు వందనం పేరుతో నగదు ప్రోత్సాహకాలు కూడా అందించారు. కాబోయే నాయకులంటూ కీర్తించారు. ఇటీవల వైకాపా అభ్యర్థులు కూడా వారితో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తాయిలాలు అందించి తమకోసం పనిచేయాలంటూ ప్రాధేయపడ్డారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించకూడదనే ఈసీ ఆదేశాలతో ఇప్పుడు పరిస్థితి మారింది. వైకాపా నాయకుల నిజ స్వరూపం బయట పడింది. వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీ ప్రచారంలో పాల్గొనాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. తమకు ఉద్యోగాలు అవసరం అని.. చేయమని చెబుతున్నా వినడం లేదు. బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆయా అధికారులకు లేఖలు అందించగా.. మరికొందరు ఏం చేయాలో పాలుపోని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే