ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది.
ఆడుదామంటూ ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం
వేసవిలో గాలికొదిలేసిన ప్రభుత్వం
శిబిరాల్లేక క్రీడాకారుల నిరుత్సాహం
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. ‘ఆడుదాం- ఆంధ్రా’ అంటూ హడావుడి చేసింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది తామే అంటూ ఆర్భాటపు ప్రచారం చేసుకుంది. రూ. కోట్ల బడ్జెట్ కేటాయించి ఊరూరా పోటీలు నిర్వహించింది. అసంపూర్తి పాఠశాల మైదానాలు, రాళ్ల నేలలు, ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆటలాడించి అభాసుపాలైంది. తీరా ఎన్నికలు ముగిశాక ఆటలు, క్రీడాకారులను గాలికొదిలేసింది. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాలకు రూపాయి కూడా కేటాయించకుంది.
న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
అధికారులు సొంతంగా నిర్వహిస్తున్న ఒంగోలు మినీ స్టేడియంలోని సెపక్ తక్రా శిబిరంలో విద్యార్థులు
అందని మార్గదర్శకాలు...
ఏడాదిపాటు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడతారు. చదువులతో అలిసిపోతారు. వారికి ఆటవిడుపు లభించేది.. తమకు ఇష్టమైన రంగాలపై ఆసక్తి చూపేది వేసవిలోనే. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఏటా వేసవిలో ఏటా మే ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాయి. క్రీడాకారులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటాయి. ఎన్నికల కోడ్ రీత్యా ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ప్రకటించారు. గడువు దాటినా శాప్ నుంచి ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. ఈ ఏడాది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో జిల్లాలోని అధికారులు, శిక్షకులు అయోమయంలో ఉన్నారు. తాజా పరిస్థితి చూస్తే ఈ ఏడాది వేసవి శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఎంతో ఉపయుక్తమైనప్పటికీ...
శిబిరాల్లో పాల్గొనే శిక్షకుడికి గౌరవ వేతనం రూ.2 వేలు, క్రీడా సామగ్రికి రూ.6 వేల నుంచి రూ.8 వేలు, మైదానం నిర్వహణ ఖర్చు కింద మరో రూ.వెయ్యి నిధులను ప్రభుత్వాలు కేటాయిస్తాయి. ఎంపిక చేసిన మైదానాల్లో బాల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్బాల్, హాకీ, ఖో-ఖో, కబడ్డీ, స్కేటింగ్, తైక్వాండో, టెన్నీకాయిట్, వాలీబాల్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చేవారు. నెల రోజుల పాటు విద్యార్థులకు అందించే ఈ శిక్షణ క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఉదయం, సాయంత్రం శిక్షణకు వచ్చే విద్యార్థులకు అల్పాహారం, తాగునీటి వసతి నిమిత్తం స్థానికంగా దాతలు సహకారం తీసుకునేవారు.
ఆ రెండు ఏదో అలా...
ఈ క్రమంలో గత ఏడాది తరహాలోనే జిల్లాలోని 50 ప్రాంతాల్లో శిబిరాల నిర్వహణకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ప్రతిపాదనలు పంపారు. కానీ మార్గదర్శకాలేవీ అందలేదు. దీంతో సార్వత్రిక ఎన్నికలను సాకుగా చూపి శిక్షణ శిబిరాలను అడ్డుకోవడంపై క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విధి లేని పరిస్థితుల్లో శాప్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులే గత నెల రోజులుగా ఒంగోలు దక్షిణ బైపాస్లోని మినీ స్టేడియంలో బాక్సింగ్, సెపక్ తక్రా, షటిల్ బ్యాడ్మింటన్ విభాగాల్లో; మార్కాపురంలో బాక్సింగ్, వాలీబాల్, ఫుట్బాల్ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తూ నెట్టుకొస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ