ఆగని వైకాపా నేతల ఆగడాలు
గిద్దలూరు నగర పంచాయతీ పాములపల్లె రహదారిలో మసీదు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
గిద్దలూరులో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
ఆక్రమించేందుకు ప్రభుత్వ స్థలంలో మట్టి పోసి ఇలా చదును చేశారు
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే: గిద్దలూరు నగర పంచాయతీ పాములపల్లె రహదారిలో మసీదు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. గతంలో ముస్లిం శ్మశాన వాటిక కోసం రెవెన్యూ అధికారులు అరెకరాకు పైగా స్థలాన్ని కేటాయించారు. ఆ సమీపంలో ఖాళీగా ఉన్న సుమారు ఎకరాన్నర స్థలాన్ని జీఎస్టీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. అనంతరం ఆ విషయాన్ని విస్మరించారు. విలువైన స్థలం కావడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న సదరు స్థలంపై వైకాపా నాయకుల కన్ను పడింది. ఆక్రమించేందుకు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో నేరుగా కాకుండా శ్మశాన వాటిక కోసమంటూ ప్రచారం సాగించారు. వాస్తవానికి ప్రజోపయోగ పనులకు కేటాయించాలనేదే ఉద్దేశమైతే అధికారులకు విన్నవించవచ్చు. అవేమీ చేయకుండా మట్టి తోలి చదును చేసే పనులను గత మూడు రోజులుగా కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది మంగళవారం అక్కడి వెళ్లి మట్టి తోలి చదును చేయకుండా నిలిపివేయించారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని విలువైన ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్