ఫలితాల వేళ శాంతికి విఘాతం కలిగిస్తే చర్యలు
ఎన్నికల ఫలితాల వేళ..శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు.
ఎస్పీ సుమిత్ సునీల్
దర్శిలో అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్
దర్శి, న్యూస్టుడే: ఎన్నికల ఫలితాల వేళ..శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. దర్శిలోని పీజీఎన్ కాంప్లెక్స్లో మంగళవారం ఎన్నికల లెక్కింపు అనంతరం జరిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే దర్శిలో అత్యధిక పోలింగ్ నమోదైందన్నారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని సకాలంలో పోలీసులు అడ్డుకున్నారన్నారు. లెక్కింపు అనంతరం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా 26వేల మంది బైండోవర్
ఎన్నికల సందర్భంగా జిల్లాలో 26 వేల మందిని ముందస్తు బైండోవర్ చేశామని ఎస్పీ తెలిపారు. గొడవలు సృష్టించిన 35 మంది వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదించామని ఆయన వివరించారు. వారిపై చర్యలకు అధికారులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. కట్టుతప్పిన అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇకముందు ఘర్షణలకు ఆస్కారమివ్వవద్దని ఆయన హితవు పలికారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేసినా, వాటిని ఇతర గ్రూపులకు తరలించినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మారణాయుధాలతో పాటు విడిగా పెట్రోలు కలిగివున్నా సహించేది లేదని, ఇలాంటి వారిపై రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతులు తీసుకోవడంతో పాటు నిబంధనలకు లోబడి వాటిని నిర్వహించుకోవాలన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. గ్రామాల్లో చిన్నపాటి గొడవలు జరిగినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ అశోక్వర్ధన్రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్