కార్యాలయంలో కీచకుడు
మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించడమే అతని పని. ఇప్పటికే కేసు నమోదైంది. ఉన్నతాధికారులు అతనిపై బదిలీ వేటు వేశారు. అయినా బుద్ధి మార్చుకోలేదు.. తీరు మారలేదు.
ఇప్పటికే కేసు నమోదైనా మారని తీరు
మార్కాపురం, న్యూస్టుడే: మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించడమే అతని పని. ఇప్పటికే కేసు నమోదైంది. ఉన్నతాధికారులు అతనిపై బదిలీ వేటు వేశారు. అయినా బుద్ధి మార్చుకోలేదు.. తీరు మారలేదు. అక్కడా ఓ మహిళా ఉద్యోగినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. అధికారులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మార్కాపురం డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో శ్రీనివాసులు సీనియర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అదే కార్యాలయంలోని మహిళా ఉద్యోగిని ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయమై ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతనిలో మార్పు లేకపోయింది. విసిగి వేసారిన ఆమె తొలుత డీఎల్పీవోకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి స్పందన లేకపోవడంతో జిల్లా పంచాయతీ అధికారిణి ఉషారాణికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించింది. స్పందించిన ఆమె అక్కడి అధికారులు, సిబ్బందిని ఒంగోలు పిలిపించి మంగళవారం వివరాలు సేకరించారు.
ఒంగోలులోనూ అదే బుద్ధి: సదరు సీనియర్ సహాయకుడు శ్రీనివాసులు ఒంగోలు డీపీవో కార్యాలయంలో పని చేసే సమయంలోనూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కార్యాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడటంతో పాటు లైంగికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయమై అప్పట్లో ఒంగోలు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అధికారులు అతన్ని ఏడాది కిందట మార్కాపురం డివిజనల్ పంచాయతీ కార్యాలయానికి బదిలీ చేశారు. మారింది స్థానమే తప్ప తన బుద్ధి కాదని శ్రీనివాసులు ఇక్కడ కూడా అదే తీరున ప్రవర్తించసాగాడు. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడుతూ.. నిత్యం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తొలుత ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురైన మహిళా ఉద్యోగులు.. చివరికి ధైర్యం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ