వేసవి చెరువులు ఖాళీ!
ఒంగోలు నగరంలోని తాగునీటి సమస్య తీవ్రస్థాయికి చేరింది. చెరువుల్లో నీరు 30 శాతానికి పడిపోయింది. దీంతో మోటార్లకు అందటం లేదు.. వీధుల్లోని చివరి కుళాయిలకు సరఫరా కావడం లేదు.
గణనీయంగా పడిపోయిన నీటి మట్టం
తాగునీటికి అల్లాడుతున్న నగర జనం
అడుగంటిన రామతీర్థం
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఒంగోలు నగరంలోని తాగునీటి సమస్య తీవ్రస్థాయికి చేరింది. చెరువుల్లో నీరు 30 శాతానికి పడిపోయింది. దీంతో మోటార్లకు అందటం లేదు.. వీధుల్లోని చివరి కుళాయిలకు సరఫరా కావడం లేదు. గంటన్నర పాటు రావాల్సిన నీరు అరగంటకే ఆగిపోతోంది. అవసరాలకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొప్పోలులోని చెన్నకేశవస్వామి గుడి ఎదుట రెండు వీధుల వాసులు ఇటీవల ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళనకు దిగడం ఇందుకు నిదర్శనం.
గుండ్లకమ్మ నుంచి నిలిచిన సరఫరా: ఒంగోలుకు రెండు వనరుల ద్వారా నీరు సరఫరా అవుతుంది. అందులో ఒకటైన గుండ్లకమ్మ జలాశయంలో నిల్వలు పడిపోయాయి. గత రెండు నెలలుగా అసలు రావడమే లేదు. మరో నీటి వనరు సాగర్ జలాలు. అవికూడా సకాలంలో విడుదల కావడం లేదు. దీంతో సమస్య తీవ్రమైంది. షెడ్యూల్ ప్రకారం ఏడాదిలో మూడుసార్లు సాగర్ జలాలు నగరానికి అందించాల్సి ఉంది. సాగర్ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండటంతో మార్చిలో నీరు విడుదల కాలేదు. ఇటీవల రామతీర్థం జలాశయానికి అరకొరగా 0.5 మీటర్ల మేర విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో నింపడంపై దృష్టిపెట్టలేదు. ఆ జలాశయం నుంచే ఒంగోలు, కందుకూరు, చీమకుర్తి పట్టణాలతో పాటు కొన్ని గ్రామాలకు కూడా సరఫరా చేయాల్సి ఉంది. దీంతో అవసరాలకు సరిపోయినంత నిల్వలు లేకపోయాయి. నీటి నిల్వలు తగ్గిపోవడం.. తద్వారా తలెత్తుతున్న ఇబ్బందులపై గురించి నగర పాలక సంస్థ అధికారులు ఇరిగేషన్ శాఖకు లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం