తెదేపాలో తిరుగుతున్నాడని బీరు సీసాతో దాడి
తెదేపాలో తిరుగుతున్నాడనే కారణంతో దళితుడిపై వైకాపా నాయకులు బీరుసీసాతో దాడి చేసిన సంఘటన పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లిలో శనివారం జరిగింది.
పీసీపల్లి, న్యూస్టుడే: తెదేపాలో తిరుగుతున్నాడనే కారణంతో దళితుడిపై వైకాపా నాయకులు బీరుసీసాతో దాడి చేసిన సంఘటన పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లిలో శనివారం జరిగింది. లింగన్నపాలేనికి చెందిన బాధితుడు ప్రభుదాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనంపై వస్తుండగా లక్ష్మక్కపల్లికి చెందిన వైకాపా నాయకుడు, సర్పంచి మాలకొండయ్య, మరి కొంతమందితో కలిసి దారిలో ప్రభుదాస్ను అడ్డగించారు. తెదేపా వారితో ఎందుకు తిరుగుతున్నావంటూ ఘర్షణకు దిగి బీరు సీసాతో దాడి చేశారు. పీసీపల్లి ఎస్సై రమేష్బాబు మాట్లాడుతూ బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తామన్నారు.
భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ జైలు
ఒంగోలు న్యాయ విభాగం: అనుమానంతో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎ.భారతి... శనివారం తీర్పు ఇచ్చారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.వసుంధర తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలేనికి చెందిన కొర్రపాటి ఏడుకొండలుకు... దర్శి మండలం వీరాయపాలేనికి చెందిన అంజలితో వివాహమైంది. వీరు తమ ముగ్గురు పిల్లలతో కలిసి... ఉపాధి నిమిత్తం ఒంగోలులో స్థిర పడ్డారు. ఏడుకొండలు ఆమెను అనుమానిస్తుండడంతో... దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 2017 అక్టోబర్ 23 రాత్రి గొడవపడి రాయితో తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు విచారించిన జిల్లా న్యాయమూర్తి... నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ