వైకాపా నేతల దుష్ప్రచారంపై చర్యలు తీసుకోండి
బెంగళూరు రేవ్ పార్టీకి తాను డ్రగ్్్స సరఫరా చేశానంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని తెదేపా యువనేత దామచర్ల సత్య కోరారు.
పోలీసులకు దామచర్ల సత్య ఫిర్యాదు
కొండపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న తెదేపా నాయకులు
ఒంగోలు నేరవిభాగం, టంగుటూరు, కొండపి గ్రామీణం, న్యూస్టుడే: బెంగళూరు రేవ్ పార్టీకి తాను డ్రగ్్్స సరఫరా చేశానంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని తెదేపా యువనేత దామచర్ల సత్య కోరారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ గురుడ్ సుమిత్ సునీల్కు ఫిర్యాదు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేష్ కుటుంబీకులతో తాను దిగిన ఫొటోలను వినియోగిస్తూ... కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైకాపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వీటిని ఫార్వార్్్డ చేసినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల తెదేపా అధ్యక్షులు, నాయకులు పోలీస్ స్టేషన్లలో శనివారం ఫిర్యాదు చేశారు. దామచర్ల కుటుంబంపై అవాస్తవాలను పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోకూరి రవీంద్ర, చేరెడ్డి నరసారెడ్డి, వేల్పుల సింగయ్య, అనుమోలు సాంబశివయ్య, అబ్బూరి అభిషేక్ వసంత రాయుడు, రామ్మూర్తి నాయుడు, దామా మురళి, రామారావు, వెంకటేశ్వర్లు, జాను, అనుమోలు సాంబశివరావు, మండవ ప్రసాద్ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ