పాత కక్షతో కారుకు నిప్పు
సింగరాయకొండలో తెదేపా నాయకుడు చిగురిపాటి గిరికి చెందిన కారు దహనం ఘటన పాతకక్షల నేపథ్యంలోనే చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ(క్రైమ్స్) శ్రీధర్రావు.. చిత్రంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్బాబు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: సింగరాయకొండలో తెదేపా నాయకుడు చిగురిపాటి గిరికి చెందిన కారు దహనం ఘటన పాతకక్షల నేపథ్యంలోనే చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ(క్రైమ్స్) శ్రీధర్రావు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు విద్యానగర్లోని చిగురుపాటి శేషగిరి అలియాస్ గిరికి చెందిన కారును ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కారు యజమాని శేషగిరి వెంటనే సింగరాయకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ(క్రైమ్స్) శ్రీధర్రావు పర్యవేక్షణలో ఒంగోలు డీఎస్పీ కిషోర్బాబు ఆరు ప్రత్యేక బృందాలను దర్యాప్తునకు ఏర్పాటు చేశారు.
భయభ్రాంతులకు గురిచేయాలనే..: కారు యజమాని చిగురుపాటి శేషగిరికి, అదే గ్రామానికి చెందిన కనసాని ఈశ్వర్రెడ్డికి మధ్య పాత విభేదాలున్నాయి. ఈశ్వర్రెడ్డి సింగరాయకొండలో లాడ్జితో పాటు బెంగళూరులో హాస్టళ్లు నిర్వహిస్తుంటారు. 2018లో ఈశ్వర్రెడ్డికీ, అశోక్ అనే వ్యక్తికి మధ్య తలెత్తిన భూవివాదంలో శేషగిరి మధ్యవర్తిగా వ్యవహరించారు. సదరు ఒప్పంద పత్రాలను తన వద్దే ఉంచుకున్నారు. దీంతో అతనిపై కక్ష పెంచుకుని కారును తగులబెట్టడం ద్వారా భయభ్రాంతులకు గురిచేయాలని భావించారు. ఇందుకు తన వద్ద పనిచేసే బాలుడిని వినియోగించుకున్నాడు. అతను తన స్నేహితుడైన పాలేటి అభిషేక్ అలియాస్ టింకూను ఆశ్రయించాడు. టింకూది జరుగుమల్లి మండలం నర్శింగోలు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. వీరికి మూడు సీసాల పెట్రోల్తో పాటు రూ.ఏడు వేల నగదును ఈశ్వర్రెడ్డి సమకూర్చి కారును దహనం చేయాలని పురమాయించారు. వీరిద్దరూ 24వ తేదీ అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్లి కారుపై పెట్రోలు పోసి నిప్పంటిచారు. అదే సమయంలో స్థానికులు చూసి కేకలు వేయటంతో అక్కడి నుంచి పారిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు ఈశ్వర్రెడ్డి, బాలుడు, అతని స్నేహితుడు అభిషేక్ అలియాస్ టింకూలను అదుపులోకి తీసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్బాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్