కోడేమైనా వైకాపా నేతల చుట్టమా!
ఎన్నికల కోడ్ అమలును వైకాపా నేతలు ఆది నుంచీ పరిహాసం చేస్తున్నారు.
అనంతవరంలో రహదారి నిర్మాణానికి పోసిన కంకర డస్ట్
టంగుటూరు, న్యూస్టుడే: ఎన్నికల కోడ్ అమలును వైకాపా నేతలు ఆది నుంచీ పరిహాసం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ అనేక అడ్డదారులు తొక్కారు. ఓటర్లకు అభ్యర్థులు, నేతలు ఉద్యోగులు, సిబ్బందికి విచ్చలవిడిగా తాయిలాలు పంచారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపకాలకు బరితెగించారు. ఎన్నికల రోజూ అదే తీరు ప్రదర్శించారు. కొన్నిచోట్ల నాయకులు ఏకంగా పోలింగ్ బూత్లలోకి వెళ్లారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా అదే తీరు ప్రదర్శిస్తున్నారు. నియమావళి అమలుకు నిలువునా తూట్లు పొడుస్తున్నారు.
కంకర డస్ట్ను చదును చేసిన దృశ్యం
సచివాలయం చెంతనే అయినా...: వాస్తవానికి ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు అమలులో ఉంటుంది. ఈ క్రమంలో నూతనంగా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలు లేదు. వైకాపా నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. టంగుటూరు మండలం అనంతవరంలో రోడ్డు పనులను యథేచ్ఛగా చేస్తున్నారు. ఆ గ్రామ ఎస్టీ కాలనీ నుంచి రొయ్యల చెరువుల వరకు కి.మీ దూరం పొడవున మట్టి రోడ్డుంది. ఈ మార్గంలో కొంత మేర గతంలో సీసీ రోడ్డు వేసి వదిలేశారు. మిగిలిన భాగాన్ని ఇప్పుడు నిర్మించే పనిలో పడ్డారు. ఇప్పటికే డస్ట్ తోలి చదును పనులు కొంతమేర పూర్తి చేశారు. ఈ పనులు గ్రామ సచివాలయానికి కూత వేటు దూరంలోనే చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై పంచాయతీరాజ్ ఏఈ శ్రీహరిని ‘న్యూస్టుడే’ ప్రశ్నించింది. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో చేపట్టిన పనులకు మెరక పనులు చేస్తున్నారని తొలుత చెప్పారు. వివాదం తలెత్తడంతో ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు పనులు నిలిపివేయాలని గ్రామ సర్పంచికి సూచించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం