తగ్గిన ధరలు.. నిలిచిన కోతలు
హనుమంతునిపాడు మండలంలో నిమ్మ దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోగా కోతలు నిలిచిపోయాయి. వారం రోజులుగా కిలో రూ.60 నుంచి రూ.30లకు పడిపోవడంతో నిమ్మ రైతులు కోతలు నిలిపి వేశారు.
కిలో నిమ్మ రూ.30కి పడిపోవడమే కారణం
భారీగా నష్టపోయిన కౌలు రైతులు
న్యూస్టుడే, హనుమంతునిపాడు
ఎగుమతులు లేక కమీషన్ దుకాణాల్లో నిలిచిన నిమ్మకాయలు
హనుమంతునిపాడు మండలంలో నిమ్మ దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోగా కోతలు నిలిచిపోయాయి. వారం రోజులుగా కిలో రూ.60 నుంచి రూ.30లకు పడిపోవడంతో నిమ్మ రైతులు కోతలు నిలిపి వేశారు. అకాల వర్షాలు ఇప్పటికే కొంతమేర పంటను దెబ్బతీశాయి. ఇప్పుడు గూడూరు, కృష్ణా జిల్లాల నుంచి అధికంగా రాష్ట్రీయ మార్కెట్కు నిమ్మ కాయలు వస్తుండడంతో ధరలు పడిపోయాయి. చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు మార్కెట్లకు ఎగుమతులు మందగించాయి. కనిగిరి కమీషన్ మార్కెట్కు రోజుకు పది లారీల సరుకు వచ్చేది. ప్రస్తుతం రెండు మూడు లారీలకు మించి రావడం లేదు. కనిగిరి ప్రాంతం నుంచి ఒంగోలు, నంద్యాల, మార్కాపురం స్థానిక మార్కెట్లకు వెళ్తున్న రెండోరకం నిమ్మకు రూ.5లకు మించి ధర రాకపోగా రైతులు కోతలు నిలిపివేశారు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో కోత కూలీలు, పార్శిల్ ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా కోతలు నిలిపి వేయండంతో తోటల్లోనే నాణ్యమైన కాయలు చెట్ల కింద కుప్పలుగా పడిపోయాయి. కూలీలకు పనులులేక ఇక్కట్లు పడుతున్నారు. కనీస ధర కూడా దక్కకపోవడంతో రూ.లక్షలు పెట్టి తోటలు తీసుకున్న కౌలు రైతులు భారీగా నష్టపోయారు. మే నెలలో కిలో రూ.వందకు తగ్గకుండా ధర వస్తుందని ఆశించిన రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. ఎండలు మండుతున్నా అకాల వర్షంతో ధర రాలేదని రైతులు వాపోతున్నారు.
హెచ్ఎంపాడులోని తోటల్లో కోతలు నిలిపివేయడంతో నేలరాలిన నిమ్మకాయలు
ప్రభుత్వమే ఆదుకోవాలి
-వనుకూరి రామిరెడ్డి, నిమ్మ రైతు, వెంగపల్లి
గతంలో మాదిరిగా నిమ్మకాయలను మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలి. కనిగిరిలో కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తే రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు విక్రయించి కనీసం పెట్టుబడులైనా దక్కించుకునేందుకు వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే