కమిషనర్ క్షమాపణ చెప్పాల్సిందే
కౌన్సిలర్ను అవమానించిన కమిషనర్ క్షమాపణ చెప్పాలంటూ... ఆయనను లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేసిన సంఘటన దర్శి నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది.
దర్శి నగర పంచాయతీకి తాళం వేసిన సభ్యులు
కౌన్సిల్ సమావేశం రసాభాస
కమిషనర్ను లోపల ఉంచి నగర పంచాయతీ కార్యాలయానికి
తాళం వేసి నిరసన తెలుపుతున్న సభ్యులు
దర్శి, న్యూస్టుడే: కౌన్సిలర్ను అవమానించిన కమిషనర్ క్షమాపణ చెప్పాలంటూ... ఆయనను లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేసిన సంఘటన దర్శి నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేశారు. వివిధ పనుల విషయంలో కమిషనర్ మంజునాథ్ గౌడ్ తీరుపై తెదేపా, వైకాపా కౌన్సిలర్లు ప్రశ్నించారు. లంచాలు తీసుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైస్ ఛైర్మన్ కోటయ్య అజెండా కాగితాలను చించి నిరసన తెలిపారు. తమ వార్డులో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం, ప్రతిపాదించినవి అజెండాలో చేర్చకపోవడంపై ప్రశ్నించగా... ఛాంబర్ నుంచి బయటకు వెళ్లాలంటూ తనతో కమిషనర్ పరుషంగా మాట్లాడారని వైకాపా రెండో వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డి ఆరోపించారు. మరో కౌన్సిలర్ మోహన్ రెడ్డి సైతం కమిషనర్ను నిలదీశారు. సభ్యులు అడిగిన వాటికి సమాధానం చెప్పాలే తప్ప బయటకు వెళ్లమనే హక్కు కమిషనర్కు లేదని పేర్కొన్నారు. ఉక్కిరిబిక్కిరైన కమిషనర్... సమావేశం నుంచి అర్ధంతరంగా లేచి ఛాంబర్కు వెళ్లిపోయారు. దీంతో ఛైర్మన్ సహా సభ్యులంతా కార్యాలయం బయటకు వచ్చి... అధికారులు, సిబ్బందిని లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేశారు. కౌన్సిలర్కు కమిషనర్ క్షమాపణ చెప్పాలని నిరసనకు దిగారు. దీంతో కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు కమిషనర్ వచ్చి... భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తానని క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాళం తీయడంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. వైస్ ఛైర్మన్లు స్టీవెన్, కోటయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలు లేవనెత్తి
* పొదిలి రోడ్డులో డీఎస్పీ కార్యాలయం ముందు అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనం కడుతున్నారని.. చర్యలు తీసుకుని ఉంటే పనులు ఎందుకు జరుగుతాయని కౌన్సిలర్లు నిలదీశారు.
* 14 వ వార్డులోని డీకే స్థలంలో ఓ నివాసానికి సంబంధించి డబ్బులు తీసుకుని ఆన్లైన్లో పేరు మార్చారంటూ వైస్ ఛైౖర్మన్ కోటయ్య ఆరోపించారు. ్ర మొత్తం 20 మంది సభ్యులకు ఇరు పార్టీల నుంచి 10 మంది మాత్రమే హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్