కమిషనర్ క్షమాపణ చెప్పాల్సిందే
కౌన్సిలర్ను అవమానించిన కమిషనర్ క్షమాపణ చెప్పాలంటూ... ఆయనను లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేసిన సంఘటన దర్శి నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది.
దర్శి నగర పంచాయతీకి తాళం వేసిన సభ్యులు
కౌన్సిల్ సమావేశం రసాభాస
కమిషనర్ను లోపల ఉంచి నగర పంచాయతీ కార్యాలయానికి
తాళం వేసి నిరసన తెలుపుతున్న సభ్యులు
దర్శి, న్యూస్టుడే: కౌన్సిలర్ను అవమానించిన కమిషనర్ క్షమాపణ చెప్పాలంటూ... ఆయనను లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేసిన సంఘటన దర్శి నగర పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేశారు. వివిధ పనుల విషయంలో కమిషనర్ మంజునాథ్ గౌడ్ తీరుపై తెదేపా, వైకాపా కౌన్సిలర్లు ప్రశ్నించారు. లంచాలు తీసుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైస్ ఛైర్మన్ కోటయ్య అజెండా కాగితాలను చించి నిరసన తెలిపారు. తమ వార్డులో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం, ప్రతిపాదించినవి అజెండాలో చేర్చకపోవడంపై ప్రశ్నించగా... ఛాంబర్ నుంచి బయటకు వెళ్లాలంటూ తనతో కమిషనర్ పరుషంగా మాట్లాడారని వైకాపా రెండో వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డి ఆరోపించారు. మరో కౌన్సిలర్ మోహన్ రెడ్డి సైతం కమిషనర్ను నిలదీశారు. సభ్యులు అడిగిన వాటికి సమాధానం చెప్పాలే తప్ప బయటకు వెళ్లమనే హక్కు కమిషనర్కు లేదని పేర్కొన్నారు. ఉక్కిరిబిక్కిరైన కమిషనర్... సమావేశం నుంచి అర్ధంతరంగా లేచి ఛాంబర్కు వెళ్లిపోయారు. దీంతో ఛైర్మన్ సహా సభ్యులంతా కార్యాలయం బయటకు వచ్చి... అధికారులు, సిబ్బందిని లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేశారు. కౌన్సిలర్కు కమిషనర్ క్షమాపణ చెప్పాలని నిరసనకు దిగారు. దీంతో కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు కమిషనర్ వచ్చి... భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తానని క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాళం తీయడంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. వైస్ ఛైర్మన్లు స్టీవెన్, కోటయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలు లేవనెత్తి
* పొదిలి రోడ్డులో డీఎస్పీ కార్యాలయం ముందు అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనం కడుతున్నారని.. చర్యలు తీసుకుని ఉంటే పనులు ఎందుకు జరుగుతాయని కౌన్సిలర్లు నిలదీశారు.
* 14 వ వార్డులోని డీకే స్థలంలో ఓ నివాసానికి సంబంధించి డబ్బులు తీసుకుని ఆన్లైన్లో పేరు మార్చారంటూ వైస్ ఛైౖర్మన్ కోటయ్య ఆరోపించారు. ్ర మొత్తం 20 మంది సభ్యులకు ఇరు పార్టీల నుంచి 10 మంది మాత్రమే హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్