ఆక్వా రైతు విలవిల
విద్యుత్తు బిల్లులు చెల్లించనివారితో పాటు కట్టినవారికి సైతం అధికారులు సరఫరా నిలిపివేయడంతో దాదాపు రూ.50 లక్షల వరకు ఆక్వా రైతులు నష్టపోయిన ఉదంతమిది.
విద్యుత్తు కనెక్షన్ తీసివేయడంతో రూ.50 లక్షల నష్టం
చెరువుల్లో ఆక్సిజన్ పడిపోవడంతో మధ్యంతరంగా రొయ్యలు పట్టించి విక్రయిస్తున్న రైతులు
టంగుటూరు, న్యూస్టుడే: విద్యుత్తు బిల్లులు చెల్లించనివారితో పాటు కట్టినవారికి సైతం అధికారులు సరఫరా నిలిపివేయడంతో దాదాపు రూ.50 లక్షల వరకు ఆక్వా రైతులు నష్టపోయిన ఉదంతమిది. టంగుటూరు మండలం పసుపుకుదురులో జేసీ ఆక్వా పేరిట 15 విద్యుత్తు సర్వీసులున్నాయి. ఇటీవల కొన్ని ఆక్వా చెరువుల పంట కాలం ముగియడంతో సాగుదారులు విరామం ప్రకటించారు. వారిలో కొందరు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఏడీ మోహన్రావు, టంగుటూరు అర్బన్ ఏఈ రామకృష్ణ, సిబ్బందితో వచ్చి సరఫరా నిలిపివేశారు. అయితే విద్యుత్తు బిల్లు చెల్లించిన ఎస్.మాల్యాద్రిరెడ్డి, మరో రైతు చెరువులకు కూడా నిలిపివేయడంతో వారు లబోదిబోమన్నారు. మాల్యాద్రిరెడ్డి మాట్లాడుతూ తాము పది ఎకరాల చెరువులను లీజుకు తీసుకొని ఆక్వా పంట వేశామన్నారు. మూడెకరాల వరకు పంట విక్రయించగా మరో ఏడు చెరువులు సాగులో ఉన్నాయన్నారు. బిల్లు చెల్లించినా సరఫరా ఆపివేయడంతో విద్యుత్తు లేక చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోయిందన్నారు. నాలుగు గంటల పాటు జనరేటర్లు వినియోగించి ఏరియేటర్లను తిప్పామన్నారు. డీజిల్ ధర అధికంగా ఉండటంతో ఖర్చు మరింత పెరిగే అవకాశముందని భావించి మంగళవారం పంట విక్రయానికి సిద్ధమయ్యామన్నారు. ప్రస్తుత పరిస్థితి వల్ల రూ.50 లక్షల పెట్టుబడిని నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు. బిల్లు చెల్లించినవారి వరకు విద్యుత్తు ఇచ్చి ఉంటే తమకు ఈ నష్టం వచ్చి ఉండేది కాదన్నారు. ఏడీ మోహన్రావును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా జేసీ ఆక్వా పేరిట ఉన్న సర్వీసులకు రూ.19.55 లక్షల బకాయిలు ఉన్నాయన్నారు. వాటిలో 5 సర్వీసులకు రూ.5.23 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించి మిగతా పదింటికి చెల్లించలేదన్నారు. ఈ కారణంగా ఆ సర్వీసులు తొలగించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ