ఆక్వా రైతు విలవిల
విద్యుత్తు బిల్లులు చెల్లించనివారితో పాటు కట్టినవారికి సైతం అధికారులు సరఫరా నిలిపివేయడంతో దాదాపు రూ.50 లక్షల వరకు ఆక్వా రైతులు నష్టపోయిన ఉదంతమిది.
విద్యుత్తు కనెక్షన్ తీసివేయడంతో రూ.50 లక్షల నష్టం
చెరువుల్లో ఆక్సిజన్ పడిపోవడంతో మధ్యంతరంగా రొయ్యలు పట్టించి విక్రయిస్తున్న రైతులు
టంగుటూరు, న్యూస్టుడే: విద్యుత్తు బిల్లులు చెల్లించనివారితో పాటు కట్టినవారికి సైతం అధికారులు సరఫరా నిలిపివేయడంతో దాదాపు రూ.50 లక్షల వరకు ఆక్వా రైతులు నష్టపోయిన ఉదంతమిది. టంగుటూరు మండలం పసుపుకుదురులో జేసీ ఆక్వా పేరిట 15 విద్యుత్తు సర్వీసులున్నాయి. ఇటీవల కొన్ని ఆక్వా చెరువుల పంట కాలం ముగియడంతో సాగుదారులు విరామం ప్రకటించారు. వారిలో కొందరు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఏడీ మోహన్రావు, టంగుటూరు అర్బన్ ఏఈ రామకృష్ణ, సిబ్బందితో వచ్చి సరఫరా నిలిపివేశారు. అయితే విద్యుత్తు బిల్లు చెల్లించిన ఎస్.మాల్యాద్రిరెడ్డి, మరో రైతు చెరువులకు కూడా నిలిపివేయడంతో వారు లబోదిబోమన్నారు. మాల్యాద్రిరెడ్డి మాట్లాడుతూ తాము పది ఎకరాల చెరువులను లీజుకు తీసుకొని ఆక్వా పంట వేశామన్నారు. మూడెకరాల వరకు పంట విక్రయించగా మరో ఏడు చెరువులు సాగులో ఉన్నాయన్నారు. బిల్లు చెల్లించినా సరఫరా ఆపివేయడంతో విద్యుత్తు లేక చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోయిందన్నారు. నాలుగు గంటల పాటు జనరేటర్లు వినియోగించి ఏరియేటర్లను తిప్పామన్నారు. డీజిల్ ధర అధికంగా ఉండటంతో ఖర్చు మరింత పెరిగే అవకాశముందని భావించి మంగళవారం పంట విక్రయానికి సిద్ధమయ్యామన్నారు. ప్రస్తుత పరిస్థితి వల్ల రూ.50 లక్షల పెట్టుబడిని నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు. బిల్లు చెల్లించినవారి వరకు విద్యుత్తు ఇచ్చి ఉంటే తమకు ఈ నష్టం వచ్చి ఉండేది కాదన్నారు. ఏడీ మోహన్రావును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా జేసీ ఆక్వా పేరిట ఉన్న సర్వీసులకు రూ.19.55 లక్షల బకాయిలు ఉన్నాయన్నారు. వాటిలో 5 సర్వీసులకు రూ.5.23 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించి మిగతా పదింటికి చెల్లించలేదన్నారు. ఈ కారణంగా ఆ సర్వీసులు తొలగించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.