పోలీసుల వేధింపులే.. ప్రాణం తీశాయా!
సింగరాయకొండ మండలం కనుమళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
చికిత్స పొందుతున్న బాధితుడు మహేష్
ఈనాడు డిజిటల్, నెల్లూరు: సింగరాయకొండ మండలం కనుమళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా మాట్లాడుకుంటున్న జంటను పోలీసులు నిలదీయడంతో పాటు సెల్ఫోన్లో చిత్రీకరించేందుకు యత్నించడమే ప్రమాదానికి కారణమన్న మాట వినిపిస్తోంది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి దగ్గరకు వెళ్లిన పోలీసులకు.. అదే విషయం తెలిపి.. గోడు వెల్లబోసుకున్నారు. బాధితుడి వివరాల ప్రకారం... ‘ఈ నెల 27వ తేదీ కందుకూరు పట్టణానికి చెందిన మహేష్ అనే వ్యక్తి... తన స్నేహితురాలితో కలిసి కారులో కందుకూరు నుంచి సింగరాయకొండ మార్గంలో వెళ్లారు. పలుకూరు అడ్డరోడ్డు దాటిన తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సమీపంలో రోడ్డు పక్కన వాహనం ఆపి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కందుకూరు పోలీసులు వారిని విచారించారు. ఇక్కడేం చేస్తున్నారు? అని నిలదీశారు. దీంతో పాటు కానిస్టేబుళ్లను వీడియో తీయమని చెప్పడంతో.. కారు వెనుక సీటులో ఉన్న యువతి భయపడి బోరున విలపించింది. వెంటనే కారులో నుంచి కిందకు దిగిన మహేష్ వారిని వేడుకున్నారు. అయినా వినకపోవడంతో తమ పరువు పోతుందనే భయంతో.. కారులో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. పోలీసులు వెంట పడుతుండటంతో.. కంగారు పడి చెట్టును ఢీకొట్టినట్లు’ బాధితుడు తెలిపాడు. ఈ ప్రమాదంలో యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విచారణాధికారిణి సింగరాయకొండ ఎస్సై ఫిరోజ్ ఫాతిమాను ‘ఈనాడు’ వివరణ కోరగా... వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు వారితో మాట్లాడారు. యువతి కూడా ఉండడంతో ప్రశ్నించారు. దానిపై సమాధానం చెప్పలేక.. వెళ్లేక్రమంలో ప్రమాదానికి గురయ్యారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్