నగదు అందక... గృహం దక్కక
పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం నెలకొంది. వైకాపా అధికారంలోకి రాగానే అప్పటి వరకు జరుగుతున్న పనులను ఆపి రివర్స్ టెండరింగ్ పిలుస్తామని ప్రకటించడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
నత్తనడకన సాగుతున్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు
లబ్ధిదారుల ఎదురుచూపులు
టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు
పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం నెలకొంది. వైకాపా అధికారంలోకి రాగానే అప్పటి వరకు జరుగుతున్న పనులను ఆపి రివర్స్ టెండరింగ్ పిలుస్తామని ప్రకటించడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సొంత ఇల్లు వస్తుందన్న ఆశతో డబ్బులు చెల్లించినవారు ఆర్థిక ఇబ్బందులతో విలవిల్లాడారు. అటు నగదు రాక.. ఇటు గృహం దక్కక అయోమయంలో పడ్డారు. ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో పనులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమైనా తమకు ఇళ్లు ఎప్పుడు దక్కుతాయోనన్న సంశయం లబ్ధిదారుల్లో నెలకొంది.
మార్కాపురం అర్బన్ న్యూస్టుడే : గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు టెండర్లను పిలిచి పనులను ప్రారంభించగా, మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 1020 మంది, మూడో విడతలో 3600 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. పట్టణ శివారులో పెద్దనాగులవరం దగ్గర స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ గృహ నిర్మాణాల పనులను అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా 2018 నవంబరు 29న ప్రారంభించారు. 4380 మంది లబ్ధిదారులు 2018 అక్టోబరు 31 నాటికి మున్సిపాలిటీకి రూ.81,90,000ను చెల్లించారు.
3468 మందికి తొలగింపు....: మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో రెండు విడతల్లో 4380 మంది రూ.500 చొప్పున రూ.21,90,000 లక్షలు డీడీ రూపంలో నగదు చెల్లించారు. అందులో నూతన ప్రభుత్వం కేవలం 912 మంది లబ్ధిదారులకు మాత్రమే టిడ్కో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అంగీకరించింది. మిగిలిన 3468 మంది లబ్ధిదారులకు మాత్రం జగనన్న కాలనీ కింద లేఅవుట్లు వేసి అందులో ప్లాట్లు కేటాయించింది. వారు 2018లో డీడీల రూపంలో చెల్లించిన రూ.17,34,000 నగదు సైతం ఇంకా చెల్లించలేదు. వారితో పాటు రెండు పడకల ఇళ్ల నిర్మాణం కోసం రూ.25 వేలు చెల్లించిన 240 మంది లబ్ధిదారులకు రావాల్సిన రూ.81,90,000 కూడా ఇంకా లబ్ధిదారులకు అందలేదు. అటు చెల్లించిన నగదు అందక...ఇళ్లు దక్కక లబ్ధిదారులు అల్లాడిపోతున్నారు. నగదు అంతా టిడ్కో ఖాతాలోనే ఉందని ప్రభుత్వం నుంచి దానిపై స్పష్టత వచ్చిన వెంటనే లబ్ధిదారులు చెల్లించిన నగదును తిరిగి చెల్లిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
కేవలం 912 గృహాలతో సరి...: ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిర్మించి ఇచ్చే విధంగా స్థానిక పెద్దనాగులవరం సమీపంలో రూ.9 కోట్లు వెచ్చించి మొత్తం 18 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో కొనుగోలు చేశారు. కానీ నూతన ప్రభుత్వం అందులో 9 ఎకరాల్లో మాత్రమే 912 మందికి ఇళ్లు నిర్మించి మిగిలిన 9 ఎకరాల్లో జగనన్న లేఅవుట్లు వేసి మిగిలిన 3468 మంది లబ్ధిదారులకు కేటాయించాలని నిర్ణయించింది. ఆ మేరకు పనులు దక్కించుకున్న ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఐజేఎంసీపీఎల్) వారు టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. సముదాయంలో మొత్తం 19 బ్లాక్లు కాగా ఒక్కో బ్లాకులో 48 గృహాల చొప్పున 912 గృహాల నిర్మాణాల పనులు సాగుతున్నాయి. అందులో ఇప్పటి వరకు 8 బ్లాకుల్లో 384 గృహాలు పూర్తి కాగా 528 గృహాలు పూర్తి కావాల్సి ఉంది. పూర్తయిన వాటిల్లో 254 ఇళ్లకు లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తయింది. మరో 238 మందికి రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు పుర అధికారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.