కొండలు కరుగుతున్నాయ్
కనిగిరి మండలం యడవల్లి, నందనమారెళ్ల సమీపంలో ఊరకొండ, యడవల్లి కొండలు దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.
యడవల్లి, నందనమారెళ్లలో దందా
80 ఎకరాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు
యడవల్లి ప్రాంతంలో కొండను తవ్వి జేసీబీతో
లారీలోకి మట్టి నింపుతున్న దృశ్యం
జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో అరుదుగా దొరికే ఎర్రమట్టి, మరస, గులక మట్టిపై అక్రమార్కుల కన్నుపడింది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఇందుకు కొండలనూ వదలడంలేదు. అయినా రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూడటంలేదు.
కనిగిరి, న్యూస్టుడే: కనిగిరి మండలం యడవల్లి, నందనమారెళ్ల సమీపంలో ఊరకొండ, యడవల్లి కొండలు దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటు మున్సిపాలిటీ పరిధిలో.. అటు కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల, చినారికట్లలో భూముల ధరలు పెరిగిపోవడంతో ఎడాపెడా వెంచర్లు వెలిశాయి. వీటిని చదును చేసేందుకు పటిష్టమైన మట్టి కావాలి. అంతే ఈ కొండలపై అక్రమార్కులు దృష్టిసారించారు. పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 వేలు, పట్టణాల్లో రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ దందా కొనసాగుతోంది.
పూర్తిగా పిండిచేస్తూ..
ఊరకొండ, యడవల్లి కొండల మద్యలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రవాణాకు సౌలభ్యంగా ఏకంగా దారిని కూడా ఏర్పాటుచేసుకోవడం విశేషం. తాము అడ్డుకుంటుండగా అధికారులతో మాట్లాడి తరలిస్తున్నామంటూ దళారులు చెబుతున్నారని స్థానికులు వాపోయారు. పైగా వారికి కొందరు నేతల అండదండలు ఉండటంతో నిస్సహాయ స్థితిలో వీరున్నారు. వందల ఏళ్లుగా ఈ కొండలు సమీప ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉన్నాయి. ఏ కాలంలోనైనా పచ్చదనంతో కళకళలాడుతూ ఉండటంతో పశువులు, మేకలు, గొర్రెల కాపరులు మేత కోసం వీటి వద్దకు జీవాలను తీసుకువెళ్తుంటారు. చూస్తుండగానే కొండలను పిండి చేస్తుండటంతో వారంతా తల్లడిల్లుతున్నారు. తక్షణం మట్టి తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు. కనిగిరి అటవీశాఖ అధికారి రామిరెడ్డిని వివరణ కోరగా అది రెవెన్యూ పరిధిలోకి వస్తుందని, వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!