కొండలు కరుగుతున్నాయ్
కనిగిరి మండలం యడవల్లి, నందనమారెళ్ల సమీపంలో ఊరకొండ, యడవల్లి కొండలు దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.
యడవల్లి, నందనమారెళ్లలో దందా
80 ఎకరాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు
యడవల్లి ప్రాంతంలో కొండను తవ్వి జేసీబీతో
లారీలోకి మట్టి నింపుతున్న దృశ్యం
జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో అరుదుగా దొరికే ఎర్రమట్టి, మరస, గులక మట్టిపై అక్రమార్కుల కన్నుపడింది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఇందుకు కొండలనూ వదలడంలేదు. అయినా రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూడటంలేదు.
కనిగిరి, న్యూస్టుడే: కనిగిరి మండలం యడవల్లి, నందనమారెళ్ల సమీపంలో ఊరకొండ, యడవల్లి కొండలు దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇటు మున్సిపాలిటీ పరిధిలో.. అటు కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల, చినారికట్లలో భూముల ధరలు పెరిగిపోవడంతో ఎడాపెడా వెంచర్లు వెలిశాయి. వీటిని చదును చేసేందుకు పటిష్టమైన మట్టి కావాలి. అంతే ఈ కొండలపై అక్రమార్కులు దృష్టిసారించారు. పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 వేలు, పట్టణాల్లో రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ దందా కొనసాగుతోంది.
పూర్తిగా పిండిచేస్తూ..
ఊరకొండ, యడవల్లి కొండల మద్యలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రవాణాకు సౌలభ్యంగా ఏకంగా దారిని కూడా ఏర్పాటుచేసుకోవడం విశేషం. తాము అడ్డుకుంటుండగా అధికారులతో మాట్లాడి తరలిస్తున్నామంటూ దళారులు చెబుతున్నారని స్థానికులు వాపోయారు. పైగా వారికి కొందరు నేతల అండదండలు ఉండటంతో నిస్సహాయ స్థితిలో వీరున్నారు. వందల ఏళ్లుగా ఈ కొండలు సమీప ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉన్నాయి. ఏ కాలంలోనైనా పచ్చదనంతో కళకళలాడుతూ ఉండటంతో పశువులు, మేకలు, గొర్రెల కాపరులు మేత కోసం వీటి వద్దకు జీవాలను తీసుకువెళ్తుంటారు. చూస్తుండగానే కొండలను పిండి చేస్తుండటంతో వారంతా తల్లడిల్లుతున్నారు. తక్షణం మట్టి తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు. కనిగిరి అటవీశాఖ అధికారి రామిరెడ్డిని వివరణ కోరగా అది రెవెన్యూ పరిధిలోకి వస్తుందని, వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!