నేటి నుంచి పెళ్లి సందడి
మూడు నెలల పది రోజుల విరామం అనంతరం వివాహ శుభకార్యాలకు మంచి రోజులు వచ్చాయి.
జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో వెయ్యి వివాహాలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: మూడు నెలల పది రోజుల విరామం అనంతరం వివాహ శుభకార్యాలకు మంచి రోజులు వచ్చాయి. అది కూడా ఈ నెల 18వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 వరకు పెళ్లిళ్లు జరగనున్నాయి. వాటితోపాటు గృహ ప్రవేశాలు, కొత్త ఇళ్లకు భూమి పూజలు చేయనున్నారు. ఇక ఈ మూడు వారాలు ఎటుచూసినా సందడే. ఏర్పాట్లకు సంబంధించి వధూవరుల కుటుంబ సభ్యులు నెల రోజుల ముందునుంచే బిజీగా ఉన్నారు. కల్యాణ మండపాలు మొదలు వివిధ రంగాలకు పని పెరిగింది. తద్వారా పెళ్లి బడ్జెట్ 30 నుంచి 50 శాతం వరకు పెరగనుంది.
ఆ తేదీల్లోనే అధికంగా..
మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 2, 3, 4, 7, 8, 9, 14, 16, 17, 18 ముహూర్తాలు ఉన్నాయి. అందులోనూ 2, 3, 4, 17, 18 తేదీల్లో ఎక్కువగా జరగనున్నాయి. ప్రస్తుత సీజన్లో జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోనే సుమారు 500 పెళ్లిళ్లు ఉండనున్నాయి. పుష్యమాసం డిసెంబర్ 24 నుంచి జనవరి 21 వరకు ఉండనుంది. ఆ సమయంలో ఎలాంటి శుభాకార్యాలు జరగవు. మాఘ మాసం దృష్ట్యా జనవరి 26 నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 200 కల్యాణ మండపాలు ఉండగా; ఒంగోలులోనే 36 వరకు కనిపిస్తాయి. శుభ కార్యం నిర్వాహకుల ఆర్థిక స్థోమతను బట్టి మండపాన్ని పూల అలంకరణ చేయిస్తారు. తద్వారా ఒక్కో పెళ్లి నిర్వహణ నిమిత్తం కల్యాణ మండపానికే రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతున్న దాఖలాలు ఉన్నాయి. అనేక మండపాలు ఇప్పటికే ఖరారు కావడంతో అవి దొరకనివారు ఇళ్లవద్దనే కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఒంగోలుకు చెందిన వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ ‘‘డిసెంబర్ 2 నుంచి 18వ తేదీ రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా వెయ్యి పెళ్లిళ్లు జరగనున్నాయి. అందులో 10 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలున్నాయి. పురోహితుల దగ్గర నుంచి అనుబంధ రంగాలన్నింటికి మంచి డిమాండ్ ఉంది.’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు