నేటి నుంచి పెళ్లి సందడి
మూడు నెలల పది రోజుల విరామం అనంతరం వివాహ శుభకార్యాలకు మంచి రోజులు వచ్చాయి.
జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో వెయ్యి వివాహాలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: మూడు నెలల పది రోజుల విరామం అనంతరం వివాహ శుభకార్యాలకు మంచి రోజులు వచ్చాయి. అది కూడా ఈ నెల 18వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 వరకు పెళ్లిళ్లు జరగనున్నాయి. వాటితోపాటు గృహ ప్రవేశాలు, కొత్త ఇళ్లకు భూమి పూజలు చేయనున్నారు. ఇక ఈ మూడు వారాలు ఎటుచూసినా సందడే. ఏర్పాట్లకు సంబంధించి వధూవరుల కుటుంబ సభ్యులు నెల రోజుల ముందునుంచే బిజీగా ఉన్నారు. కల్యాణ మండపాలు మొదలు వివిధ రంగాలకు పని పెరిగింది. తద్వారా పెళ్లి బడ్జెట్ 30 నుంచి 50 శాతం వరకు పెరగనుంది.
ఆ తేదీల్లోనే అధికంగా..
మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 2, 3, 4, 7, 8, 9, 14, 16, 17, 18 ముహూర్తాలు ఉన్నాయి. అందులోనూ 2, 3, 4, 17, 18 తేదీల్లో ఎక్కువగా జరగనున్నాయి. ప్రస్తుత సీజన్లో జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోనే సుమారు 500 పెళ్లిళ్లు ఉండనున్నాయి. పుష్యమాసం డిసెంబర్ 24 నుంచి జనవరి 21 వరకు ఉండనుంది. ఆ సమయంలో ఎలాంటి శుభాకార్యాలు జరగవు. మాఘ మాసం దృష్ట్యా జనవరి 26 నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 200 కల్యాణ మండపాలు ఉండగా; ఒంగోలులోనే 36 వరకు కనిపిస్తాయి. శుభ కార్యం నిర్వాహకుల ఆర్థిక స్థోమతను బట్టి మండపాన్ని పూల అలంకరణ చేయిస్తారు. తద్వారా ఒక్కో పెళ్లి నిర్వహణ నిమిత్తం కల్యాణ మండపానికే రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతున్న దాఖలాలు ఉన్నాయి. అనేక మండపాలు ఇప్పటికే ఖరారు కావడంతో అవి దొరకనివారు ఇళ్లవద్దనే కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఒంగోలుకు చెందిన వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ ‘‘డిసెంబర్ 2 నుంచి 18వ తేదీ రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా వెయ్యి పెళ్లిళ్లు జరగనున్నాయి. అందులో 10 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలున్నాయి. పురోహితుల దగ్గర నుంచి అనుబంధ రంగాలన్నింటికి మంచి డిమాండ్ ఉంది.’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు