ఆ పాఠశాలలదంతా కనికట్టు
విద్యార్థులు లేకున్నప్పటికీ ఉన్నట్టు చూపుతూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసుకోవాలని గిద్దలూరు, రాచర్లలోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నించాయి.
చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశాలు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: విద్యార్థులు లేకున్నప్పటికీ ఉన్నట్టు చూపుతూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసుకోవాలని గిద్దలూరు, రాచర్లలోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నించాయి. ఆ మేరకు అన్ ఎయిడెడ్, ప్రైవేట్ బడుల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి తరగతుల్లో కూర్చోబెట్టారు. తనిఖీకి వచ్చిన అధికారుల కళ్లకు కనికట్టు కట్టేందుకు ప్రయత్నించారు. తీరా విద్యాశాఖ డైరెక్టర్(అడ్మిన్) పార్వతి నేతృత్వంలోని బృందం సభ్యులు క్షుణ్నంగా పరిశీలించడంతో అసలు విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఈనాడు’లో డామిట్ కథ అడ్డం తిరిగింది’ శీర్షికన నవంబర్ 20న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఎయిడెడ్ పాఠశాలల పోస్టుల నియామకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టారు. విద్యాశాఖ అదనపు డైరెక్టర్ పార్వతి ఇచ్చిన నివేదిక మేరకు బోగస్ రోల్ చూపించిన గిద్దలూరులోని నాలుగు ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి డీఈవోకు శనివారం ఉత్తర్వులిచ్చారు. ఇదిలా ఉండగా రోస్టర్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎయిడెడ్ యాజమాన్యాలు.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నాయంటూ బీసీ సంఘాల నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు