logo

ప్రణవి.. జాతీయ స్థాయిలో మెరిసి

జాతీయ స్థాయి షూటింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించిన ద్వారం ప్రణవిని ఎస్పీ మలికా గార్గ్‌ అభినందించారు. నవంబర్‌ 19 నుంచి 26 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ 66వ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు.

Published : 02 Dec 2023 00:48 IST

ఎస్పీ మలికా గార్గ్‌తో క్రీడాకారిణి ప్రణవి

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి షూటింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించిన ద్వారం ప్రణవిని ఎస్పీ మలికా గార్గ్‌ అభినందించారు. నవంబర్‌ 19 నుంచి 26 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ 66వ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో పది మీటర్ల షూటింగ్‌(పిస్టల్‌) జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కొత్తపట్నం మండలం రంగాయపాలేనికి చెందిన ద్వారం ప్రణవి పాల్గొన్నారు. తన ప్రతిభతో కాంస్య పతకం సాధించారు. అనంతరం స్వస్థలానికి చేరుకున్న ఆమె ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి పోటీలతో పాటు గతంలో తాను పలు పోటీల్లో తాను సాధించిన విజయాలను ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత గొప్పగా నైపుణ్యాలను ప్రదర్శించి అద్భుత విజయాలతో జిల్లా, రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు. ప్రణవి వెంట ఆమె తల్లిదండ్రులు ప్రగతి, బాలిరెడ్డి, షూటింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఖాదర్‌వలి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని