Donakonda: అబ్బో.. దొనకొండపై ప్రేమే!
వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఎంతో ఆశ పడ్డారు.
ఎన్నికల వేళ మభ్య పెడుతున్న పాలకులు
పారిశ్రామిక పర్యటనలు షురూ
ఎంఎస్ఎంఈ పార్కు బోర్డు
న్యూస్టుడే, దొనకొండ : వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఎంతో ఆశ పడ్డారు. భూముల ధరలకు తాత్కాలికంగా రెక్కలొచ్చాయే తప్ప అంతకుమించి అడుగు పడింది లేదు. దొనకొండ మండలంలో 21 గ్రామాల్లోని 25 వేల ఎకరాల భూమిని కారిడార్గా 2016లో కేటాయించారు. 40 బృందాలతో ఆరు నెలలపాటు ప్రభుత్వం రూ.60 లక్షలు ఖర్చు పెట్టి దస్త్రాలు తయారు చేయించింది. 2019లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో కారిడార్ నిర్మాణానికి అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు చేతుల మీదుగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రాగమక్కపల్లెలో 43.79 ఎకరాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.8 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం కొలువు దీరడంతో వీటన్నింటికీ మంగళం పాడింది.
మూడేళ్లు దాటుతున్నా.. కదలిక ఏదీ
2020-2021లో విమానాల తయారీ విభాగాలకు 2600 ఎకరాల భూములు ఉక్రెయిన్ దేశానికి, గృహ నిర్మాణాలకు అవసరమైన పరికరాలు తయారు చేసే ఫ్రైడ్ కంపెనీకి 5వేల ఎకరాలు, దొనకొండలోని విమానాశ్రయం భూముల్లో ఎయిర్ఫోర్స్ వారు శిక్షణ కేంద్రం మరికొన్ని కంపెనీలకు భూములను కేటాయించారు. రుద్రసముద్రం, రామక్కపల్లి, భూమనపల్లి గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని అధికారులు, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గ్రామసభ నిర్వహించి చెప్పారు. భూములిస్తే ఎకరాకు ఏడాదికి రూ.25వేలు కౌలు ఇస్తామని, ముందుగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మూడేళ్లు దాటుతున్నా దీనికి అతీగతీ లేదు.
నీటి వసతి సైతం లేక..
దొనకొండ పరిధిలోని భూముల్లో నీటి వసతి కనిపించకపోవటంతో వచ్చినవారు వెనక్కి వెళ్తున్నారు. మండలంలో సాగర్ కాలువ వెళ్తున్నా గ్రామాలకే నీరు లేదని, చెరువులు నిర్మించి నీరు నిల్వ ఉండేలా పనులు చేసి ఉంటే కంపెనీలు వచ్చేవని చెబుతున్నారు. ఈ భూములు పరిశీలించడానికి గత నెల 27న పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, కలెక్టర్ దినేష్ కుమార్, 28న ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్, భారత్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీ బృందం పరిశీలించింది. కంపెనీలు వస్తాయంటూ మళ్లీ చెప్పించే చెబుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల ముందు పాలకుల హంగామా అని చర్చించుకుంటున్నారు.
ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ.. పాలకులు కొత్త నాటకాలకు తెర లేపారు. నాలుగున్నరేళ్లుగా దొనకొండ ముఖం చూడని నేతలు, అధికారులు పారిశ్రామిక అభివృద్ధి అంటూ మళ్లీ హడావుడి చేస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తూ మభ్య పెట్టే కార్యక్రమాలు చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది.
కారిడార్కు కేటాయించిన భూములివే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీస్ స్టేషన్ ఎదుట దొంగల హల్చల్
[ 26-07-2024]
మార్కాపురంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక గడియార స్తంభం వద్ద ఉన్న పూల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం