ISRO: మిత్రో.. చూసొద్దామా ఇస్రో.. విద్యార్థులకు అరుదైన అవకాశం
చంద్రయాన్3 విజయవంతంతో భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది.
శ్రీహరికోటలోని షార్ కేంద్రం
పామూరు, న్యూస్టుడే: చంద్రయాన్3 విజయవంతంతో భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. త్వరలో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ అగ్రరాజ్యాలతో పోటీపడుతోంది. ఇస్రోను వీక్షించాలది విజ్ఞానదారుల్లో నడిచే విద్యార్థుల బలమైన కోరిక. దీనికి మార్గమేంటి? ఎవర్ని సంప్రదించాలి.. ఏం చేయాలి... చిట్టి బుర్రల్లో బోలెడు ప్రశ్నలు. ఇక జిల్లాకు కూతవేటు దూరంలో నే శ్రీహరికోట ఉండడంతో ఇక్కడివారికి మరింత ఆసక్తి. అలాంటి భావి పౌరుల కోసం ఈ వివరాలు..
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ ఇదే..
ఇస్రో చూడాలనుకునే వారు ముందుగా సంస్థకు చెందిన మెయిల్లో వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. లేకుంటే ఎస్డీఎస్సీ-షార్ గ్రూప్ డైరెక్టర్ల మెయిల్స్కు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఏదైనా స్కూల్, సంస్థకు సంబంధించి నేరుగా మెయిల్లో వివరాలు తెలియజేస్తే ప్రయోగాలు లేని సమయంలో అనుకూలతను బట్టి పంపించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి ముందుగా మెయిల్లోనే అనుమతులు ఇచ్చి, ఆహ్వానాన్ని తెలియజేస్తారు.
వెళ్లేది ఇలా..
అనుమతించిన రోజుల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇస్రోను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తారు. కార్యాలయం వద్ద ఉదయం అనుమతి పత్రాలు చూపిస్తే ప్రత్యేక పాస్లు మంజూరు చేస్తారు. మధ్యాహ్నం భోజనం ఇతర వాటికి ముందుగా నగదు చెల్లిస్తే ఏర్పాట్లు చేస్తారు. విద్యార్థులు బృందంగానే వెళ్లాలి. బస్సుల్లో వస్తే వీక్షించేందుకు వీలుగా ఉంటుంది. కార్లు, ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. బస్సుల్లో బృందంగా వచ్చే విద్యార్థుల కోసం ఇస్రో సంస్థ ఓ గైడ్ను సైతం ఏర్పాటు చేస్తుంది.
ఏం చూడొచ్చు..
ప్రధానంగా ఇస్రో విజయాలను తెలియజేసే మ్యూజియం ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు సాధించిన ఘనత, చేసిన ప్రయోగాలు, వాటి ఫలితాలను విశ్లేషిస్తారు. తద్వారా భవిష్యత్తులో మానవ మనుగడకు కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. ఇస్రోలో ప్రధానంగా మిషన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. రాకెట్ దిశను నియంత్రించే విధానం, ప్రయోగం, ఇతర అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరిగిపోతాయి. రాకెట్ను ప్రయోగించే రెండు లాంచింగ్ ప్యాడ్లను వీక్షించేందుకు పిల్లలకు అవకాశం కల్పిస్తారు.
నేరుగా వీక్షించేందుకు..
ఇస్రో ఏదైనా రాకెట్ను ప్రయోగిన్తే నేరుగా శ్రీహరికోట నుంచి వీక్షించేందుకు అవకాశం ఉంది. ప్రయోగానికి వారం ముందు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతుంది. అలా దరఖాస్తు చేసిన వారిలో కొందరిని ఎంపిక చేసి ప్రత్యేక పాస్లు అందిస్తారు. ప్రయోగ సమయంలో అక్కడకు చేరుకోవడం ద్వారా దగ్గర నుంచి వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
అన్నం పెట్టే చదువులకు.. అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!