CM Jagan : నమస్కారం.. ప్రతిగా అవమానం : సీనియర్ ఎంపీని పట్టించుకోని జగన్
పార్లమెంట్ సాక్షిగా ఒంగోలు సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఘోర అవమానం చోటుచేసుకుంది. జూనియర్లకు ఇచ్చిన గౌరవం కూడా ఆయనకు దక్కకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి వెళ్తున్న బృందంలోనూ స్థానం లభించకుంది.
జగన్ తీరుకు ఖిన్నుడైన మాగుంట
బృందంతో పార్లమెంట్ భవనంలోకి వెళ్తుండగా ముఖ్యమంత్రి జగన్కు ఎదురుగా వచ్చి నమస్కరిస్తున్న శ్రీనివాసులురెడ్డి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: పార్లమెంట్ సాక్షిగా ఒంగోలు సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఘోర అవమానం చోటుచేసుకుంది. జూనియర్లకు ఇచ్చిన గౌరవం కూడా ఆయనకు దక్కకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి వెళ్తున్న బృందంలోనూ స్థానం లభించకుంది. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి నమస్కారం చేసినప్పటికీ నిర్లక్ష్యమే ఎదురైంది. ఈ అనూహ్య పరిణామానికి ఖిన్నుడైన మాగుంట.. చివరికి ఏకాకిగా మిగిలి.. అవమానకర స్థితిలో వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లా రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన మాగుంట కుటుంబానికి దేశ రాజధాని దిల్లీలో సీఎం సాక్షిగా ఎదురైన పరాభవం ఇది.
మెట్ల వద్ద ఏకాకిగా మిగిలి: రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలు, రాజకీయ పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీకి విన్నవించేందుకు ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం దేశ రాజధాని దిల్లీ వెళ్లారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో మోదీని కలిసేందుకు పార్లమెంట్ హౌస్కు చేరుకున్నారు. ఈ సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట పార్లమెంట్ హౌస్ ఎదుట జగన్కు నమస్కారం చేస్తూ ఎదురొచ్చారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలతో పాటు సీనియర్ అధికారులతో మాట్లాడుతూ వెళ్తున్న సీఎంకు అత్యంత చేరువగా వచ్చి పలకరించేందుకు మాగుంట ప్రయత్నించారు. అయినప్పటికీ జగన్ ఆయన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు. మిగిలినవారు కూడా ఆయన్ను తమ బృందంలో కలుపుకొనేందుకు చొరవ చూపలేదు. దీంతో క్షణాల వ్యవధిలోనే మాగుంట చివరి వరుసలోకి రావాల్సి వచ్చింది. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన తనతో వ్యవహహరించిన ఈ తీరుకు మాగుంట ఖిన్నుడయ్యారు. సీఎం బృందంతో కలిసి పార్లమెంట్లోకి వెళ్లకుండా దిక్కులు చూస్తూ మెట్ల కిందే నిల్చుండిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి.
జిల్లా రాజకీయాల్లో చర్చ: సీఎం జగన్ దిల్లీ పర్యటనలో మాగుంటతో పోలిస్తే జూనియర్లు అయిన ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్లకే ప్రాధాన్యం దక్కింది. జగన్తో కలిసి వారంతా పార్లమెంట్ హౌస్లో ప్రధాని కార్యాలయం వరకు వెళ్లారు. మాగుంట మాత్రం మెట్ల వద్దనే నిలిచిపోవాల్సి వచ్చింది. జగన్ వ్యవహరించిన తీరు ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. మాగుంట కుటుంబానికి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. చివరికి దిల్లీ పర్యటనకు వచ్చిన సీఎంను మర్యాదపూర్వకంగా పలకరించడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!