రెండ్రోజుల్లో జమ్ముకశ్మీర్కు వెళ్లనుండగా... జవాన్ను కబళించిన మృత్యువు
కుమారుడు అయిదు నెలల కిందట పుట్టాడు. ఆ చిన్నారి బాలుడిని చూసేందుకు 20 రోజుల కిందట స్వస్థలానికి వచ్చారు ఆర్మీ జవాను మనోజ్కుమార్ (31). పోరుమామిళ్లలో శుక్రవారం జరిగే సంతకు తెలిసిన మరో ఇద్దరితో కలిసి వచ్చారు.
పోరుమామిళ్ల, న్యూస్టుడే: కుమారుడు అయిదు నెలల కిందట పుట్టాడు. ఆ చిన్నారి బాలుడిని చూసేందుకు 20 రోజుల కిందట స్వస్థలానికి వచ్చారు ఆర్మీ జవాను మనోజ్కుమార్ (31). పోరుమామిళ్లలో శుక్రవారం జరిగే సంతకు తెలిసిన మరో ఇద్దరితో కలిసి వచ్చారు. వెంటాడిన మృత్యువు వాహనం రూపంలో ఆర్మీ జవానును కబళించింది. హృదయవిదారకరమైన ఘటనకు సంబంధించి ఎస్ఐ మల్లికార్జునరెడ్డి వివరాల మేరకు.. బేస్తవారపేట మండలం గలిజేరుగుళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాను మనోజ్కుమార్కు భార్య లక్ష్మి, అయిదు నెలల కుమారుడు ఉన్నాడు. కుమారుడిని చూసేందుకు 20 రోజుల కిందట స్వగ్రామానికి వచ్చారు. మరో రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్లో విధుల్లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో పోరుమామిళ్లలో సంత చూసేందుకు అంజి, తిరుపతయ్య అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వచ్చారు. అనంతరం అదే మార్గంలో సాయంత్రం తిరిగి వెళుతుండగా రామిరెడ్డికుంట వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన అంజిని, తిరుపతయ్యను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మనోజ్కుమార్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటన తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు