దద్దాలకే వైకాపా మొగ్గు.. త్వరలోనే నా భవిష్యత్తు
కనిగిరి వైకాపాలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా పలువురు తమ నిరసనను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. కనిగిరి సిటింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కాదని.
ఆత్మీయులతో మాజీ ఎమ్మెల్యే బాబూరావు
సమావేశంలో మాట్లాడుతున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు
సి.ఎస్.పురం, న్యూస్టుడే: కనిగిరి వైకాపాలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా పలువురు తమ నిరసనను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. కనిగిరి సిటింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కాదని.. హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ యాదవ్ను నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకాలం టికెట్ ఆశిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సీఎస్పురం మండలం శీలంవారిపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణే అని వైకాపా పెద్దలు చెబుతున్నారని, అతన్ని మార్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కులాలను చూసి సీట్లు కేటాయిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వైకాపా అధిష్ఠానం తనకు సీటు కేటాయిస్తానని గతంలో హామీ ఇచ్చిందని.. అందుకే తాను గత నాలుగేళ్లుగా పార్టీకి సేవలు చేశానని తెలిపారు. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా సమావేశానికి హాజరైన వారిలో అత్యధిక మంది స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని కదిరిని కోరడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు