జనాన్ని విస్మరించి.. జగన్ సేవలో తరించి..
ప్రయాణికులను విస్మరించి..పాలకుల సేవలో తరిస్తూ ఆర్టీసీ ప్ర‘గతి తప్పుతోంది. ఫలితంగా బస్సులు లేక వేలాదిమంది మండుటెండల్లో మగ్గిపోయారు.
ప్ర‘గతి’ తప్పిన ఆర్టీసీ
బస్సుల్లేక అవస్థలు
ఒంగోలులో జనాన్ని తరలించేందుకు బారులు తీరిన బస్సులు
ఒంగోలు అర్బన్, ఒంగోలు నగరం: ప్రయాణికులను విస్మరించి..పాలకుల సేవలో తరిస్తూ ఆర్టీసీ ప్ర‘గతి తప్పుతోంది. ఫలితంగా బస్సులు లేక వేలాదిమంది మండుటెండల్లో మగ్గిపోయారు. శుక్రవారం వందలాది బస్సులను ముఖ్యమంత్రి సభలకు కేటాయించడంతో ఒంగోలు, కనిగిరి, కొండపి, కంభం, పొదిలి తదితర డిపోల్లో వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడారు. జిల్లా రీజియన్ పరిధిలో 151 బస్సులను దీనికి కేటాయించారు. వీటిలో ఒంగోలు డిపో నుంచి 45, పొదిలి నుంచి 25, కనిగిరి 20, మార్కాపురం 36, గిద్దలూరు నుంచి 25 బస్సులను జగన్ సభకు మళ్లించారు.
ఒంగోలు డిపోలో బస్సులు లేక మధ్యాహ్నం వేళ ఎదురుచూపులు
కనిగిరి ప్రాంతంలో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూసి విసుగు చెందారు. డిపోలో బస్సులు లేక ఆటోలు, ప్రైవేటు వాహన చోదకులకు అదనంగా చెల్లించి గమ్య స్థానాలకు చేరుకున్నారు.
అద్దంకి నుంచి కశ్యాపురం అలవలపాడు, తక్కెళ్లపాడు, చందలూరు, కొణికి మీదుగా ఇంకొల్లుకు ప్రతిరోజూ రెండు బస్సులు అయిదు ట్రిప్పులు తిరుగుతాయి. చివరి ట్రిప్పు రాత్రి 8.30కు అద్దంకి నుంచి ఇంకొల్లు వెళుతుంది. ఆ డిపో నుంచి 20 బస్సులు గురువారం రాత్రికే ఒంగోలుకు రప్పించారు. దీంతో చివరి ట్రిప్పు రద్దయి రాత్రివేళ స్వగ్రామాలకు చేరుకోలేక నానా అవస్థలు పడ్డారు. శుక్రవారం ఆ మార్గంలో పూర్తిగా సర్వీసులు నిలిచిపోయాయి. కొందరు బస్సులు లేక పనులు వాయిదా వేసుకున్నారు.
ఎండ వేడికి విలవిల్లాడుతున్న చిన్నారికి మంచినీళ్లు తాగిస్తున్న కుటుంబీకులు
నరకం తప్పడం లేదు
-సుబ్బయ్య, చిరు వ్యాపారి, తక్కెళ్లపాడు, జె.పంగులూరు మండలం
ఈ వారంలో ఒక్కరోజు మాత్రమే అద్దంకి - ఇంకొల్లు మార్గంలో బస్సు నడిచింది. మొన్న రాప్తాడు సభ కోసం, శుక్రవారం ఒంగోలు సభ కోసం బస్సుల్ని పెద్దఎత్తున పంపేశారు. డ్రైవర్లు అక్కడి విధులకు హాజరై విశ్రాంతి తీసుకుని వస్తుండటంతో బస్సులు అందుబాటులో ఉండటం లేదు. బస్సులు మా కోసం నడుపుతున్నారనిపించడం లేదు. నిత్యం నరకం తప్పడం లేదు.
నిర్మానుష్యంగా కనిగిరి ఆర్టీసీ డిపో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు