బెదిరించినా బస్సులెక్కలేదు
ముఖ్యమంత్రి జగన్ సభ అంటే సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మొన్న రాప్తాడు, ఇప్పుడు ఒంగోలులో ఇదే పరిస్థితి. నగరంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
రహదారులపై ఖాళీగానే వాహనాలు
లెక్క కోసం తీసుకురావడంతో బస్సుల్లోనే ఉండిపోయిన వృద్ధులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్ సభ అంటే సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మొన్న రాప్తాడు, ఇప్పుడు ఒంగోలులో ఇదే పరిస్థితి. నగరంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభకు లబ్ధిదారులు, ఇతర జనాన్ని తరలించడం కోసం ప్రకాశం జిల్లా రీజియన్తో పాటు పక్క జిల్లాలైన నెల్లూరు, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల రీజియన్ల నుంచి కూడా బస్సులను కేటాయించారు. ప్రకాశం నుంచి 151, నెల్లూరు నుంచి 110, బాపట్ల నుంచి 54, పల్నాడు నుంచి 88, గుంటూరు నుంచి 97 బస్సులు ఇందులో ఉన్నాయి. జిల్లాకు సంబంధించి ఒంగోలు డిపో నుంచి 45, పొదిలి నుంచి 25, కనిగిరి నుంచి 20, మార్కాపురం నుంచి 36, గిద్దలూరు నంచి 25 బస్సులను కేటాయించారు. సభకు ముందురోజే ఆయా రూట్లలో నిలిపేసి ఒంగోలుకు రప్పించారు. మహిళా లబ్ధిదారులు, పొదుపు సంఘాల మహిళలను తీసుకొచ్చే బాధ్యత మెప్మా రిసోర్స్ పర్సన్లు, యానిమేటర్లు, వాలంటీర్లకు అప్పగించారు. నగరంలో 50 డివిజన్లుండగా.. ఒక్కో డివిజన్కు ఏడు నుంచి 15 వరకు బస్సులు ఏర్పాటు చేశారు. అంతమంది రాకపోవడంతో కొన్ని బస్సులు రహదార్లపై సాయంత్రం వరకు ఖాళీగా నిలిపి ఉంచాల్సి వచ్చింది. దీనివల్ల రెండు రోజులుగా గ్రామీణ ప్రాంతాలకు బస్సుల్లేక ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
జనం లేక మంగమూరు రోడ్డులో ఖాళీగా నిలిపి ఉంచిన బస్సులు
పథకాలు రావంటూ హెచ్చరికలు...: నగరంతో పాటు, నియోజకవర్గంలోని ఒంగోలు, కొత్తపట్నం మండలాలతో పాటు, పొరుగు నియోజకవర్గాలైన సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలను సభకు తరలించేందుకు ఏపీఎం, సీసీలు, గ్రామ సమాఖ్య ప్రతినిధులు, యానిమేటర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ‘శుక్రవారం ఉదయం 6 గంటలకల్లా బస్సు మీ గ్రామానికి వస్తుంది. అందులో ఎక్కాల్సిందే. లేకుంటే వైఎస్సార్ ఆసరాతో పాటు, వచ్చే నెలలో ఇవ్వనున్న చేయూత, ఇతర సంక్షేమ పథకాలు రావు’ అని హెచ్చరించారు. మండలాల వారీగా సభలకు మహిళలను తీసుకొచ్చేలా లక్ష్యాలిచ్చారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో జనాన్ని సమీకరించలేపోయారు. బస్సులు ఎక్కే వారు లేక పలుచోట్ల ఖాళీగా దర్శనమిచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి