logo

వాలంటీర్లకు తాయిలాల ఎర.. రూ.30 లక్షలు పంపిణీ చేసినట్లు ప్రచారం

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైకాపా నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆ క్రమంలో వాలంటీర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు

Updated : 25 Feb 2024 09:10 IST

పెద్దారవీడు, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైకాపా నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆ క్రమంలో వాలంటీర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా, వైకాపా మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో... తర్లుపాడు, మార్కాపురం మండలాలకు చెందిన 450 మంది వాలంటీర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున నగదు, స్వీట్‌ బాక్సులు అందజేసి... ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. మొత్తంగా రూ.30 లక్షలు పంపిణీ చేసినట్లు సమాచారం. తాయిలాలు అందుకునేందుకు దేవరాజుగట్టు సమీపంలోని కళాశాలకు సోమవారం రావాలని... నియోజకవర్గంలోని మిగిలిన మండలాల వాలంటీర్లకూ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని