‘రూ.లక్ష ఇవ్వు.. లేదంటే కేసు’
న్యాయ అన్యాయాలు విచారించి బాధితుల తరఫున నిలవాల్సిన ఎస్సై.. అక్రమాలకు పాల్పడుతున్న వారికి వత్తాసు పలికారు. దారికి రాకుంటే ఇబ్బందులు పడతారంటూ ఫిర్యాదుదారుల పైనే కేసు నమోదుకు సిద్ధమయ్యారు.
అక్రమార్కులకు వత్తాసు
బాధితుల పైనే బెదిరింపులు
ఏసీబీకి చిక్కిన ఎస్సై నాగేశ్వరరావు.. చిత్రంలో స్వాధీనం చేసుకున్న నగదు
టంగుటూరు, న్యూస్టుడే: న్యాయ అన్యాయాలు విచారించి బాధితుల తరఫున నిలవాల్సిన ఎస్సై.. అక్రమాలకు పాల్పడుతున్న వారికి వత్తాసు పలికారు. దారికి రాకుంటే ఇబ్బందులు పడతారంటూ ఫిర్యాదుదారుల పైనే కేసు నమోదుకు సిద్ధమయ్యారు. మీపై ఎలాంటి కేసు కాకుండా ఉండాలంటే రూ.లక్ష నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారుల వలకు చిక్కారు. అనిశా డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో అక్రమంగా బ్యారన్ల నిర్మాణం చేస్తున్నారని, పనులు నిలుపుదల చేయాలంటూ ఆ గ్రామ సర్పంచి కొమ్మినేని రమణమ్మ కుమారులు శ్రీనివాసులు, వెంకటరావు టంగుటూరు ఎస్సై నాగేశ్వరరావుకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తీసుకుపోగా వారిని తీవ్ర దుర్భాషలాడి పంపించేశారు. అనంతరం సర్పంచి కుమారులు తనను బెదిరిస్తున్నారంటూ బ్యారన్లు నిర్మిస్తున్న వ్యక్తి ఎస్సైకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో వారిపై కేసు నమోదు చేయకుండా, కేవలం 41ఏ కింద నోటీసు ఇచ్చి వదిలేయాలంటే రూ.లక్ష నగదు లంచంగా ఇవ్వాలని ఎస్సై వారిని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గత నెల 29న మేదరమెట్ల వద్ద ఓ హోటల్లో రూ.30 వేలు ఇప్పటికే ఇచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులను బాధితులు ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బాధితుడు కొమ్మినేని శ్రీనివాస్ టంగుటూరులోని చెల్లెమ్మతోటలో ఎస్సై నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇంటి బయట వేచి ఉండగా.. ఎస్సై తన కారులో వచ్చి రూ.70 వేలు తీసుకున్నారు. ఆ డబ్బును కారులో దాచి పెట్టగా, అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎన్ఎస్ఎస్.అపర్ణ, సీహెచ్ శేషు, ఎస్సైలు జేబీఎన్ ప్రసాద్, మస్తాన్ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
-
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
-
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
-
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
-
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
-
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు