ఇట్లుంటది జగన్ తోని.. ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్
రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది.
పాల డెయిరీకి ఏకంగా పాడె కట్టారు
ఎద్దుల ఊసే పట్టని వైకాపా సర్కారు
విధానాలతో విలవిల్లాడిన పశు పోషకులు
రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. పాదయాత్ర వేళ ఆదుకుంటానంటూ మొసలి కన్నీరు కార్చిన జగన్.. గద్దెనెక్కిన తర్వాత తన అసలు స్వరూపాన్ని బయట పెట్టారు. కూల్చడమే తప్ప కట్టడం తెలియదు. కడుపులు మాడ్చడమే తప్ప నింపేందుకు మనసు రాదు. అవకాశాలున్నా.. అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేయలేదు. ప్రకాశానికి పెద్ద పరిశ్రమలు ఒక్కటీ తేలేదు. సరికదా ఉన్నవీ బతకనివ్వలేదు. పదుగురికి బతుకునిచ్చే ఒంగోలు పాల డెయిరీకి పాడె కట్టారు. వందల మంది ఉద్యోగులు, కార్మికులను రోడ్డున పడేశారు. వేల సంఖ్యలోని రైతు కుటుంబాలకు ఉన్న ఏకైక పెద్ద దిక్కును మూసేయించారు. జిల్లాకు ప్రపంచ స్థాయిలోనే ఓ గుర్తింపుగా నిలిచిన ఒంగోలు జాతి గిత్తల సంరక్షణ ఊసే మరిచారు. వాటి మనుగడకే ముప్పు వాటిల్లుతున్నా ఉలుకూ పలుకు లేకుండా ఉండిపోయారు. మొత్తానికి ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్ వేసి.. ఇట్లుంటది వినాశకారి జగన్ తోని అని అంతా చెప్పుకొనేలా చేశారు.
ఈనాడు, ఒంగోలు
గిత్త.. పట్టించుకోనేలేదట...
ఒంగోలు గిత్తలు, ఆవుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చేపట్టిన ప్రత్యేక చర్యలేమీ లేవు. ప్రపంచంలోనే మేలు రకం జాతిగా ‘ఒంగోలు’కు పేరు. ఇటువంటి వాటిని పరిరక్షించి మరింత అభివృద్ధి చేసేలా పాటుపడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా పట్టించుకోలేదు. దీంతో గతంలో రెండు లక్షలకు పైగా ఉన్న గిత్తల సంఖ్య ప్రస్తుతం 50 వేలకు పడిపోయింది. పశువుల మేతకు వీలుగా ఉన్న బీడు భూములను కూడా వైకాపా నేతలు చాలా వరకు ఆక్రమించారు. వాటికి మేత కూడా దొరికే పరిస్థితి లేకపోయింది.
వినాశకారి విఫల ప్రయోగం...
జగన్ సర్కారు 2020లో పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంచి ధర ఇస్తామని జిల్లా కలెక్టర్ నుంచి సచివాలయ సిబ్బంది వరకు అందరితో పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది. ఒంగోలు డెయిరినీ అమూల్కు కట్టబెట్టి.. 176 పాల కేంద్రాల నుంచి నిత్యం పాలను సేకరించేలా ప్రణాళిక రచించింది. చెప్పిన ధర చెల్లించకపోవడం, పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోవడం, కొన్ని మండలాల్లో మాత్రమే సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి కారణాలతో పాడి రైతులు మొగ్గు చూపలేదు. ఫలితంగా ఇందులో దాదాపు సగం కేంద్రాలు మూతపడ్డాయి. ్ర తాళ్లూరు మండలంలో మొత్తం 21 కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. అందులో 13 నిరుపయోగంగా మారాయి. ్ర ముండ్లమూరు మండలంలో 22 కేంద్రాలు ఏర్పాటు చేస్తే అందులో 11 అలంకారప్రాయంగా మిగిలాయి.
లక్ష మంది జీవితాల్లో చీకట్లు...
బహిరంగ మార్కెట్లో రూ. వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఒంగోలు డెయిరీ జిల్లాలోని పాడిరైతులకు గతంలో ఓ వరం. ఆసియాలోనే రెండో అతి పెద్దదిగా పేరు. మూడు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన పౌడర్ ప్లాంట్తో పాటు, రోజుకు ఆరు లక్షల లీటర్ల పాల సేకరణతో లక్ష మంది జీవితాల్లో వెలుగులు నింపింది. మితిమీరిన రాజకీయ జోక్యంతో క్రమంగా ప్రాభవం కోల్పోయింది. గత తెదేపా ప్రభుత్వం గాడిన పెట్టే ప్రయత్నం చేసింది. అధికారులతో కూడిన పాలకవర్గాన్ని నియమించి రూ.35 కోట్ల నిధులు కేటాయించింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వస్తానే అమూల్కు కట్టబెట్టింది. రోజుకు 18 వేల లీటర్లు పాలు సేకరిస్తున్న పరిస్థితిని పెంచాల్సిన అమూల్ నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదంటూ ఏకంగా మూసేసింది. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. లక్ష మంది రైతుల జీవితాలకు భరోసాగా నిలిచిన ప్లాంట్ కొండెక్కింది.
తుప్పు పడుతున్న డెయిరీలోనివిలువైన యంత్ర పరికరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీస్ స్టేషన్ ఎదుట దొంగల హల్చల్
[ 26-07-2024]
మార్కాపురంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక గడియార స్తంభం వద్ద ఉన్న పూల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ