శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
చందాలతో కంకర రోడ్డు
అయిదేళ్ల పాలనలో పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
పలుమార్లు విన్నవించుకున్నా.. స్పందన కరవు
అవస్థల మధ్య అక్కడి ప్రజల జీవనం
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది. వెరసి అడగడుగునా సమస్యలతో శివారు ప్రాంతాల ప్రజలు సతమతమవుతున్నారు. అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారు. జీవన ప్రమాణాలు క్షీణించాయి. మౌలిక వసతులు కల్పనలో వైకాపా ప్రభుత్వం విఫలం అయిందని వారంతా వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు తమ కష్టాలు తీర్చలేదని ఆవేదన చెందుతున్నారు.
-న్యూస్టుడే, పలాస, ఇచ్ఛాపురం
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో శివారులో ఉన్న మీలగారంపాడు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో జీడి తోటల మధ్య ఉంది. ఆ తోటల మధ్య నుంచే రాకపోకలు చేస్తుంటారు. సరైన రోడ్డులేక ఇక్కట్లు నిత్యకృత్యమయ్యాయి. సమస్య పరిష్కరించకపోవడంతో విసుగు చెంది చందాలు వేసుకుని కంకర రోడ్డు వేసుకున్నారు.
ఒక్కటి కూడా పరిష్కరించలేదు
కోసంగిపురం నుంచి అడవికొత్తూరుకు వెళ్లాలంటే సుమారు 2 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ గ్రామంలో తక్కువ సంఖ్యలో ఇళ్లు ఉండటంతో పాలకులు పట్టించుకోవడం లేదు. రోడ్లు లేవు, కాలువ వ్యవస్థ సరిగా ఉండదు. వైకాపా అయిదేళ్ల పాలనతో ఏ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు తెలిపారు.
మీలగారంపాడుకు దారి
రాత్రయితే భయం
మా గ్రామంలో 46 ఇళ్లు ఉండేవి. తుపాను విరుచుకు పడడంతో ప్రస్తుతం 26 మాత్రమే ఉన్నాయి. కాశీబుగ్గ కు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరం. ఎన్నో సమస్యలు గ్రామాన్ని పీడిస్తున్నాయి. రోడ్డు వేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. తరచూ ఎలుగుబంట్లు వస్తాయి. చీకటిలో వాటి దాడికి గురవుతామని భయపడుతున్నాం. వీధి దీపాలు వేయాలని పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు కోరితే.. స్పందన కరవైంది.
-వాసుదేవ్, యశోదమ్మ, మీలగారంపాడు, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం
మేమే శుభ్రం చేసుకుంటున్నాం
తాళభద్ర-ఉప్పరపేట కూడలి వద్ద రోడ్డుపైనే పడేస్తున్న చెత్త
పారిశుద్ధ్య కార్మికులు మా గ్రామానికి అప్పుడప్పుడు వస్తున్నారు. దీంతో చెత్త నిల్వలు పేరుకుంటున్నాయి. చేసేదేం లేక మేమే చెత్తను సేకరించి గ్రామం బయట పడేస్తున్నారు.
- ఆర్.నరహరి, పాయకరాంపురం, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం
పన్నుల భారం భరించలేకపోతున్నాం
తమ ప్రాంతంలో కాలువలు సక్రమంగా లేవు. పన్నులు మాత్రం పెంచేస్తున్నారు. కాలువ నిర్మాణం కూడా చేయకపోవడంతో అందరికీ ఇబ్బంది తప్పడం లేదు. మురుగుపారేలా కాలువలు, రోడ్లు వేసి, వీధి దీపాలు ఏర్పాటుచేయాలని చెప్పినా చేయలేదు.
-ఎం.సురేఖ, ఇచ్ఛాపురం
బావి నీరే దిక్కు
మేము ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో రత్తకన్నలో ఉంటున్నాం. కాలువలు లేవు. రహదారి కూడా వేయాల్సి ఉంది. వీధి దీపాలు అమర్చాలి. మాకు పన్ను భారం నానాటికీ పెరిగిపోతోంది. బావినీటినే తాగేందుకు ఉపయోగిస్తున్నాం. కుళాయిలు కొన్ని ప్రాంతాలలోనే ఉన్నాయి. వాడుకనీరు, మురుగునీరు రోడ్లమీదే ప్రవహిస్తున్నాయి. -జి.పరశయ్య, రత్తకన్న
పురపాలక సంఘం: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం
- వార్డులు మొత్తం : 31
- శివారు ప్రాంతాలు : 9
- గ్రామాలు : 12
- శివారు ప్రాంతాల జనాభా : 3 వేలు
పురపాలకసంఘం : ఇచ్ఛాపురం
- వార్డులు : 23
- శివారు ప్రాంతాలు : 15
- శివారు ప్రాంతాలలో జనాభా : 9వేలు
- శివారు ప్రాంతాలు : కొండపోలమ్మకాలనీ, రత్తకన్న రోడ్లు, బెల్లుపడ, అచ్చమ్మపేట, సంతపేట, వాంబేకాలనీ, గాంధీనగర్, కస్పావీధులు, కండ్రవీధి, బెల్లుపడకాలనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ