ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం.
నిధులు లేక నిలిచిన పనులు
నెరవేరని ముఖ్యమంత్రి హామీ
ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో విస్తరణకు నోచుకోని వైనం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం.
న్యూస్టుడే, నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణకు ఐదేళ్లుగా గ్రహణం వీడడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 3 కి.మీ. ర.భ. రహదారిని అభివృద్ధి చేసేందుకు నిధుల లేమి వెంటాడుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిని విస్తరించక పోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు ఆమోదం తెలపగా, అదే ఏడాది అప్పటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పనులను ప్రారంభించినా నేటికీ కొలిక్కి రాలేదు.
అరకొర పనులు
నరసన్నపేట సమీపంలోని సత్యవరం కూడలి నుంచి జమ్ము కూడలి వరకు పాత జాతీయ రహదారి 2.8 కి.మీ. కాగా, ర.భ శాఖ ఈ రహదారిని నిర్వహిస్తోంది. 2021 జూలై 9న ఈ మార్గం విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న నిధులు కేవలం రూ.4.5కోట్లు. దీంతో స్థానిక పోలాకి కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు 1.1 కి.మీ. పొడవునా 80 అడుగుల రహదారిగా విస్తరించారు. అటు ఇటు విడిచిపెట్టి మధ్యలో ప్రారంభమైన ఈ పనులు 2022 డిసెంబరు నాటికి పూర్తయ్యాయి. ఇక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సత్యవరం కూడలి వరకు, మరోవైపున పోలాకి కూడలి నుంచి జమ్ము కూడలి వరకు పనులు చేయాల్సి ఉంది. 1.7కి.మీ. మేర రహదారిని విస్తరించాలి. దీనికి మరో రూ.11 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మూడేళ్ల క్రితమే జమ్ము కూడలి నుంచి పెద్దపేట వరకు రహదారికి రెండు వైపులా ఉన్న భవనాలను కూల్చివేశారు. తీరా రహదారి నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. కేవలం పట్టణం నడిబొడ్డున మాత్రమే పనులు చేసి చేతులు దులుపుకొన్నారని పలువురు పెదవి విరుస్తున్నారు. మిగిలిన పనులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని ఎదురు చూస్తున్నారు.
హడావుడి తప్ప ఆచరణ లేదు
నాలుగేళ్ల క్రితం ప్రధాన రహదారి విస్తరణకు వైకాపా ప్రభుత్వం హడావుడి చేసి పలు భవనాలను కూల్చివేసింది. తీరా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. కేవలం కొద్ది దూరం మాత్రమే విస్తరించి చేతులు దులుపుకొంది. ఈ పనులకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు.
- బోయిన సతీష్, లచ్చుమన్నపేట
మాట తప్పిన ముఖ్యమంత్రి
నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ నరసన్నపేట వచ్చి మరీ రూ.10 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఒక్క రూపాయి విడుదల చేయలేదు. విస్తరణకు నోచుకోక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- తాళాభక్తుల గోవిందరావు, ఆదివారపుపేట
ప్రభుత్వానికి నివేదించాం
నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు రూ.11కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాలేదు. మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తీరుస్తాం.
- రాజశేఖర్, ఏఈ, ర.భ.శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే