‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు.
దళారుల చేతిలో మోసపోతున్న రైతులు
రహదారిపై ఆరబెట్టిన సన్నరకం ధాన్యం
న్యూస్టుడే, నరసన్నపేట: ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. ప్రస్తుతం రబీ వరి పైర్లు కోతల దశలో ఉండగా.. ధరలపై రైతులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ధర విషయంలో కోతలు పెడుతూ దళారులు మోసగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్దతు ధర కంటే కాస్త ఎక్కువకే కొనుగోలు చేస్తున్నా.. సన్నరకాల ధాన్యం గిరాకీ మేరకు ధరలు పలకడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా రబీ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, సన్నరకం ధాన్యంపై అధికారుల నిఘా లేకపోవడం దళారులకు కలిసొచ్చినట్లయింది.
జిల్లావ్యాప్తంగా రబీలో 12,334 ఎకరాల్లో వరి సాగు చేయగా.. అందులో దాదాపు ఆర్ఎన్ఆర్, 1010 వంటి సన్నరకాలనే పండించారు. ప్రస్తుతం చాలా చోట్ల కోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఎచ్చెర్ల, గార, జలుమూరు, టెక్కలి, నరసన్నపేట, తదితర మండలాల్లో 1,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. మొత్తం 29 మండలాల్లో వరి సాగు జరుగుతోంది. రబీలో దాదాపు 35 వేల టన్నుల ధాన్యం దిగుమతి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రబీలో సాధారణ రకం ధాన్యం అమ్మేందుకు తంటాలు పడాల్సి వస్తుండటంతో పాటు విపణిలో సన్నరకాలకు గిరాకీ ఉన్నందున అన్నదాతలు రబీలో ఆర్ఎన్ఆర్ వంటి రకాల సాగుపై దృష్టి సారించారు. ఇప్పుడు వాటికి సరైన ధర లేక దిగులు చెందుతున్నారు.
రోజురోజుకూ క్షీణిస్తూ..
జిల్లాలో వరి సాగు ప్రారంభం నాటికి 80 కిలోల బస్తా ధర రూ.2,600 వరకు పలికేది. కోతలు ఆరంభమైన తరుణంలో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించి.. రూ.2 వేల వంతున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సన్నాల రకం 80 కిలోల బస్తా ధర రూ.1,762 కాగా.. 83 కిలోల బస్తా ధాన్యాన్ని రూ.2 వేలకు కొంటున్నారు. మద్దతు ధర కంటే ఎక్కువకే పంట అమ్ముడుపోతున్నా.. అది కూడా రైతులకు గిట్టుబాటు కాదు. దీన్ని అవకాశంగా తీసుకుని దళారులు ధరలను ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ముగిసే వరకు సన్నరకాల ధరలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. నెల రోజుల నుంచి సన్నరకాలపై బస్తాకు రూ.600 వరకు తగ్గిపోయింది.
వ్యాపారులదే హవా..
నేను 7 ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ వరి సాగు చేస్తున్నాను. ఇప్పటికే కొంత మేర కోత కోసి నూర్పిడి చేశాను. సన్నరకాల ధాన్యం ధరలను దళారులు ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నారు. ధరలపై ప్రభుత్వ ప్రమేయం లేకపోవడంతో వ్యాపారులదే హవాగా మారింది. తూకంలోనూ 3 కిలోల వంతున అదనంగా తీసుకుంటున్నారు.
- నేతింటి విశ్వేశ్వరరావు, నరసన్నపేట
కష్టపడినా ఫలితం లేదు..
ఎన్నో కష్టాలు పడి రబీలో వరి సాగు చేసినా ఫలితం లేదు. సాగునీరు అందుబాటులో లేక ఎక్కువ ఖర్చు చేసి దూరం నుంచి నీటిని రప్పించాం. తీరా పంట చేతికొచ్చిన తర్వాత ధరలు కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం మా ఊరిలో 83 కిలోల ధాన్యం బస్తా రూ.1,950కు కొనుగోలు చేస్తున్నారు.
- పాగోటి అప్పలనాయుడు, కంబకాయ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం