రాజకీయం మారుతోంది..!
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది
ఎన్నికల వేళ అధికార పార్టీకి ఎదురుదెబ్బ
తెదేపా గూటికి చేరుతున్న వైకాపా నేతలు
తెదేపాలో చేరిన వైకాపా జిల్లా కోశాధికారి తులసీవరప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో మామిడి గోవిందరావు
న్యూస్టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం), పొందూరు, రణస్థలం, మెళియాపుట్టి, కొత్తూరు: జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది. ప్రచారాలు సైతం ఊపందుకున్నాయి. మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగనున్న తరుణంలో అధికార వైకాపాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కీలక నేతలంతా గడప దాటుతున్నారు. అసంతృప్తిని తట్టుకోలేక ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున వైకాపా కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాయి. గురువారం పెద్దఎత్తున వైకాపా నుంచి తెదేపాలో చేరికలు కొనసాగాయి.
తెదేపాలో చేరిన కొత్తూరు ఉప ఎంపీపీ
పాతపట్నం నియోజకవర్గ రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామం గురువారం చోటు చేసుకుంది. కొత్తూరు మండలంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వైకాపా తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ నాయకుడు ఎల్.తులసీవరప్రసాద్తో పాటు వైకాపా ఎంపీటీసీ సభ్యులు చింతాడ శ్రావణి, వీర్రాజు, కృష్ణవేణి, సింహాచలం, గౌరీకుమార్, సుమతి, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, వందలాది మంది వైకాపాను వీడారు. ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరావు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా తులసీవరప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.
- మెళియాపుట్టికి చెందిన పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. మెళియాపుట్టి సర్పంచి కుమారుడు రేఖాన వాసు, ఉప సర్పంచి మాడుగుల భానూజీరావు, వార్డు సభ్యులు గాలి రామారావును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
- శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ తెదేపా బలం పెరుగుతోంది. పలువురు తటస్థులు, వైకాపా నాయకులు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ను కలిసి మద్దతు తెలిపారు. నగరంలోని ఆయన కార్యాలయంలో గుత్తు చిన్నారావు, అల్లంశెట్టి జనార్దనరావు, పేట పద్మ, బెవర రమణ, రెడ్డి ఎర్రయ్య, తదితరులకు కండువాలు వేసి శంకర్ పార్టీలోకి ఆహ్వానించారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేస్తామని వారంతా పేర్కొన్నారు.
- పొందూరు మండలంలో వైకాపాబలహీనపడుతోంది. కింతలి గ్రామంలో సర్పంచి పైడి రాంప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు కూటికుప్పల హనుమంతురావు ఆధ్వర్యంలో 95 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. తెదేపా ఆమదాలవలస అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
- లావేరు మండలం లింగాలవలస వైకాపా సర్పంచి లుకలాపు అప్పలనాయుడు ఎచ్చెర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావును కలిశారు. త్వరలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు. మెంటాడలో 110 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం