జగన్ రాజ్యంలో.. బస్సెక్కినా బాదుడే..!
ఆర్టీసీలో ప్రయాణం ‘సురక్షితం.. సుఖవంతం..’ ఇది ఒకప్పటి మాట. జగన్ జమానాలో అది ‘ప్రమాదకరం.. ఆర్థిక భారం..’గా మారిపోయింది. వైకాపా పాలనలో ప్రజల తప్పనిసరి అవసరాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారు.
అయిదేళ్లలో మూడు సార్లు ఛార్జీలు పెంచిన వైకాపా ప్రభుత్వం
ఆర్టీసీలో ప్రయాణం ‘సురక్షితం.. సుఖవంతం..’ ఇది ఒకప్పటి మాట. జగన్ జమానాలో అది ‘ప్రమాదకరం.. ఆర్థిక భారం..’గా మారిపోయింది. వైకాపా పాలనలో ప్రజల తప్పనిసరి అవసరాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణ రథమైన ఆర్టీసీ బస్సులనూ వదల్లేదు. ఛార్జీలను మూడుసార్లు పెంచేశారు. పల్లెవెలుగు సర్వీసులతో పాటు ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ ఇలా అన్నింటా బాదేశారు. సామాన్యులకు తెలియకుండానే వారి జేబులకు చిల్లులు పెట్టారు. ఇంత ఆర్థిక భారం మోపినా కొత్త బస్సు ఒక్కటీ ఇవ్వలేదు. కాలంచెల్లిన డొక్కు బస్సులనే తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
న్యూస్టుడే, అరసవల్లి: జిల్లాలో ఆర్టీసీ డిపోలు నాలుగు ఉన్నాయి. శ్రీకాకుళం ఒకటి, రెండుతో పాటు టెక్కలి, పలాస డిపోల పరిధిలో 329 బస్సులు ఉన్నాయి. వాటిలో సంస్థకు చెందినవి 220, అద్దె వాహనాలు 87, అదనంగా మరో 22 ఉన్నాయి. వాటిలో అధిక శాతం పల్లెవెలుగు బస్సులే. ఆయా రూట్లలో ప్రయాణించేవారిపై మూడు సార్లు ఛార్జీలు పెంచారు. దీంతో రోజువారీ కూలి పనులకు వెళ్లే వారికి వచ్చే కొద్దిపాటి ఆదాయంలో అధిక శాతం ప్రయాణాలకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.
భారం మోపారిలా..
- జగన్ అధికారం చేపట్టిన ఆరు నెలలకే ఇంధన ధరలు, బస్సుల విడిభాగాలు, టైర్ల రేట్లు పెరగడంతో పాటు సిబ్బంది వేతనాలు భారంగా మారాయని చెబుతూ 2019 డిసెంబరులో ఛార్జీలు పెంచారు.
- డీజిల్ సెస్ పేరుతో 2022లో ఏప్రిల్ 14వ తేదీన మరోసారి ఆర్థిక భారం మోపారు. 20 కిలోమీటర్లకు రూ.5, 60 కి.మీ.కు రూ.10, 90 కి.మీలకు రూ.15 చొప్పున పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. ఉదాహరణకు ఛార్జీ రూ.27, రూ.29గా ఉంటే చిల్లర సమస్యను సాకుగా చూపి దాన్ని రూ.30గా చేశారు.
- అదే సంవత్సరం జులైలో మూడో సారి సామాన్యుల నడ్డి విరిచింది. 30 కిలోమీటర్లకు రూ.5, 70 కి.మీ.కు రూ.10, 70 కి.మీ నుంచి 500 కి.మీ. వరకు రూ.20 చొప్పున బాదేశారు.
ఈ నెల 12న పలాసలో ఓ ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ దాటక ముందే మొరాయించింది. ఎంత ప్రయత్నించినా ఇంజిన్ స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇలా అయిదేళ్లలో జిల్లాలో అనేక చోట్ల బస్సులు మొరాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఒడిశాలో రూ.10కే ప్రయాణం..
- భీమారావు, దేవళభద్ర, నందిగాం మండలం
నందిగాం మండల కేంద్రం నుంచి మా ఊరికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే రూ.10 చెల్లించేవాళ్లం. ప్రస్తుతం మేం రూ.20 చెల్లిస్తున్నాం. పిడిమందస వెళ్లాలంటే ఒక్కటే బస్సు ఉండటంతో గంటసేపు నుంచి వేచి చూస్తున్నాం. వేరే బస్సులో వెళ్తే కొర్రాయిగేటు కూడలి వద్ద దిగి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నా సుఖం ఉండట్లేదు. ఒడిశా ప్రభుత్వం మాదిరిగా రూ.10కే ప్రయాణం సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.
రూ.40 పెంచేశారు...
- నాగరాజు, శ్రీకాకుళం
నేను రెండు, మూడు రోజులకొకసారి విశాఖపట్నం బస్సులోనే వెళ్లివస్తుంటాను. అయిదేళ్లలో ఛార్జీలు బాగా పెరిగాయి. ఒకప్పుడు అల్ట్రాడీలక్స్ ఛార్జీ రూ.135 ఉండేది. అది ఇప్పుడు రూ.175 అయింది. రూ.40 పెంచేశారు. అడిగితే టోల్, సెస్ అంటూ ఏవేవో లెక్కలు చెబుతున్నారు.
సామాన్యుల పరిస్థితి ఏంటి?
- జె.రామచంద్రరావు, గొర్రిబంద, సారవకోట మండలం
ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచేశారు. సారవకోట నుంచి నరసన్నపేట వెళ్లేందుకు ఒకప్పుడు రూ.20 ఛార్జీ ఉండేది. పలుమార్లు పెరగడంతో ఇప్పుడు రూ.35 తీసుకుంటున్నారు. ఇలా ఇష్టానుసారం పెంచుకుంటూ పోతే సామాన్య ప్రయాణికుల పరిస్థితి ఏంటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు